తమిళనాడులో ఓ అదిరిపోయే క్రేజీ కాంబినేషన్ సెట్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. విలక్షణ, సంచలన నటుడిగా పేరున్న కోలీవుడ్ క్రేజీ హీరో శింబు కెరీర్ ఆది నుంచి వివాదాల మయమే. ఎన్నో ఎఫైర్లు శింబు కెరీర్ను డౌన్ చేశాయి. ముందు నయనతారతో ప్రేమ, నటి హన్సికతో పెళ్లి దాదాపు ఖయం అనుకున్న సమయంలో రివర్స్ అవడం శింబు క్రేజ్ను ఆకాశం నుంచి పాతాళానికి పడేశాయి. కోలీవుడ్లో మోస్ట్ బ్యాచిలర్ హీరో అయిన శింబు ఇటీవలే తన మాజీ లవర్ హన్సిక 50వ సినిమాలో గెస్ట్ రోల్ చేశాడు. ప్రస్తుతం శింబు మానాడు చిత్రంలో నటిస్తున్నారు. (రాజ రాజ చోర’ అంటే దొంగలందరికీ రాజు లాంటివాడు అని అర్థం).
ఇక ఇప్పుడు శింబు - అనుష్క కాంబినేషన్ సెట్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. సౌత్ను ఇప్పటికే ఏలేసిన అనుష్క కొద్ది రోజులుగా రేసులో వెనకపడింది. బాహుబలి తర్వాత ఆమెకు అనుకున్న రేంజ్లో ఛాన్సులు రావడం లేదు. ఇక ఆమె పెళ్లిపై రోజుకో వార్త వస్తోంది. అనుష్కను చివరిగా సైరా నరసింహారెడ్డి చిత్రంలో అతిథి పాత్రలో చూశాం. ఇక ఇప్పుడు అనుష్కను శింబు పక్కన నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయట.
గౌతమ్ మీనన్ దర్శకత్వంలో అనుష్క చాలా రోజుల క్రితమే ఓ సినిమాలో చేయాల్సి ఉంది. అయితే ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండడంతో ఈ కాంబినేషన్ సెట్ కాలేదు. విన్నైతాండి వరువాయా చిత్ర సీక్వెల్కు కథను రెడీ చేసినట్లు ఇటీవల గౌతమ్ మీనన్ చెప్పారు. ఈ సినిమా తెలుగులో 2010లో ఏమాయ చేశావే పేరుతో వచ్చి సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్లోనే శింబు, అనుష్కను సెట్ చేస్తున్నట్టు ఊహాగానాలు వస్తున్నాయి. అనుష్క తమిళంలో నటించి చాలా రోజులు అయ్యింది.
ఇప్పుడు ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ అవుతుందా అన్నదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇకపోతే శింబు, అనుష్క ఇంతకు ముందు ‘వానం’ చిత్రంలో నటించారు. మళ్లీ నటిస్తే ఈ కాంబినేషన్పై భారీ అంచనాలు ఉంటాయి.