ఈమధ్య కాలం వరకు టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ స్టేటస్ ఎంజాయ్ చేసిన రకుల్ ప్రీత్ అందరి టాప్ యంగ్ హీరోలతోను నటించింది. ఈమె నటించిన చాల సినిమాలు కమర్షియల్ గా సక్సస్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఈమె తన పారితోషికం తగ్గించుకుంటాను అంటూ అనేకమంది దర్శక నిర్మాతలకు లీకులు ఇస్తున్నా చాలామంది ఆమెను పట్టించుకోవడం లేదు. 

 

దీనితో కనీసం ఆమె తమ్ముడుని హీరోగా చేద్దామని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు కూడ విజయవంతం కాలేదు. ఇలాంటి పరిస్థితులలో తీవ్ర మనస్తాపంలో ఉన్న రకుల్ ప్రీత్ తాను తప్పు చేసాను అంటూ ఆమె ఓపెన్ గా చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. తన కెరియర్ మంచి పీక్ లో ఉన్న సమయంలో తన నటనకు సంబంధించిన పాత్రలకు ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం తన గ్లామర్ ను నమ్ముకుని తాను సినిమాలు చేయడం వల్ల తనకు ఈ పరిస్థితి వచ్చింది అంటూ చాల బాధ  పడింది. 


ప్రస్తుతం ఆమె శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో కమ‌ల్‌హాస‌న్‌ కు జంట‌గా  ‘ఇండియన్‌ 2’ సినిమాలో నటిస్తూ తమిళ హీరో శివకార్తికేయన్‌ తో మ‌రో చిత్రంలో నటిస్తోంది. ఇదే సందర్భంలో ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చాలామంది హీరోయిన్స్ అందాల ఆరబోతకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆ విషయం అది ఎంత పెద్ద తప్పో ఇప్పుడు తనకు అర్థమైంది అంటూ కామెంట్స్ చేస్తోంది. 


అంతేకాదు తాను షూటింగ్ సమయంలో నిర్మాతతో కానీ దర్శకుడుతో కానీ ఎప్పుడు గొడవలు పెట్టుకోలేదనీ తన పారితోషిక విషయంలో కూడ ఏ నిర్మాతకు భారంగా తాను వ్యవహరించ లేదని అంటూ అభిప్రాయపడుతోంది. అయితే ఇప్పుడు రష్మిక హవా నడుస్తున్న పరిస్థితులలో ఎంత పశ్చాత్తాపం పడుతున్నా రకుల్ కష్టాలను వినే నాధుడు ఎవరు అన్నదే సందేహం. చివరికి బాలయ్య బోయపాటి మూవీలో హీరోయిన్ ఛాన్స్ గుమ్మం వరకు వచ్చి ఆగిపోయిన రకుల్ కు మళ్ళీ టర్నింగ్ ఎప్పుడు వస్తుందో చూడాలి..    

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: