సినిమా తీసే పరిస్థితులు మారినట్టే హీరో, హీరోయిన్లు తమ పద్ధతులు కూడా మార్చారు. అయితే వీరి పద్ధతులు వారికే సౌకర్యంగా ఉన్నాయి కానీ.. నిర్మాతలకు ఒరిగేదేమీ లేదనే విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అయితే ఈ పరిస్థితిని సాక్షాత్తూ మెగాస్టార్ చిరంజీవి స్వయంగా చెప్పడంతో ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ఆ డైలాగులు మొదటగా తగిలేది ఆయన మేనల్లుడు అల్లు అర్జున్ కే అని గుసగుసలు వినిపిస్తున్నాయి.

 

 

‘హీరోలంతా కేరవాన్ లకే పరిమితమైపోతున్నారు. ఇది నిర్మాతలకు భారమే కానీ ఎటువంటి లాభం లేదు. యూనిట్ లో కూర్చుంటే క్రమశిక్షణ పెరుగుతుంది.. సెట్లో జరిగే పనులు పకడ్బందీగా జరుగుతాయి. అంతే కానీ కేరవాన్ లో కూర్చుంటే ఏం తెలుస్తుంది. పైగా అసిస్టెంట్ డైరక్టర్లకు కేరవాన్ లో కూర్చున్న హీరోలను పిలవడమే పనిగా మారుతోంది. వారు పని నేర్చుకునే అవకాశమే లేకపోతోంది’ అంటూ మెగాస్టార్ ఇచ్చిన స్పీచ్ కు ఇండస్ట్రీ అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మొన్నామధ్య బన్నీ ఏకంగా 7కోట్లు పెట్టి అత్యాధునికమైన కేరవాన్ కొనుక్కుని దానికి ఫాల్కన్ అని పేరు కూడా పెట్టుకున్నాడు. ఇంత ఖరీదుతో అత్యాధునిక టెక్నాలజీతో సౌత్ ఇండియాలో ఏ హీరోకు కూడా కేరవాన్ లేకపోవడం విశేషం.

 

 

చిరంజీవి డైలాగులు అందరు హీరోల గురించే అయినా.. ప్రత్యేకించి ఈ వ్యాఖ్యలు మొదట తగిలేది బన్నీకే. అంతటి కేరవాన్ కొన్నాక షూటింగ్ గ్యాప్ లో అందులోనే ఉంటాడు కానీ షూటింగ్ స్పాట్ లో ఉండే అవకాశం లేదు. ఇండస్ట్రీ పెద్దగా చిరంజీవిని చూస్తున్న టాలీవుడ్ కు ఆయన వ్యాఖ్యలు సబబుగానే అనిపించాయి. సొంత మామయ్య నుంచే ఇటువంటి వ్యాఖ్యలు రావడం బన్నీకి ఇబ్బందిగానే మారతాయని అంటున్నారు. చిరంజీవి వ్యాఖ్యలను బన్నీ ఎలా తీసుకుంటాడో వేచి చూడాల్సిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: