టాలీవుడ్ లో ఇప్పుడు సమంతా వైపు దర్శకులు చూడటం లేదని అంటున్నారు. అగ్ర దర్శకులు కూడా ఆమెతో సినిమా చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. స్టార్ హీరోయిన్ అయినా సరే ఆమెతో సినిమాలు వద్దనే భావనలోనే దర్శక నిర్మాతలు ఉన్నారు. దీనికి కారణం ఆమెకు క్రేజ్ ఉన్నపళంగా తగ్గిపోవడమే. ఇటీవల ఆమె నటించిన జానూ సినిమా ఊహించిన స్థాయిలో విజయం సాధించలేదు. దేనితో ఆమె సినిమాలకు దూరం అవ్వాలని భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. త్వరలోనే ఆమె సినిమాలకు దూరం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. 

 

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈమె కాస్త సరికొత్తగా ఆలోచించే ప్రయత్నం చేస్తుందని టాలీవుడ్ జనాలు అంటున్నారు. తాజాగా 'జాను'తో ప్రేక్షకుల ముందుకొచ్చింది సమంత. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం కమర్షియల్ గా వర్కౌట్ కాకపోయినా, నటిగా ఆమెకు మంచి మార్కులే పడ్డాయి. హారర్ థ్రిల్లర్ జానర్స్ సమంతకు పెద్దగా కలసి రావడం లేదు. 'రాజుగారి గది 2', 'యూ- టర్న్' సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. మరో తమిళ హారర్ మూవీ చేసే అవకాశం ఉందని ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. గేమ్ ఓవర్' మూవీ ఫేమ్ అశ్విన్ శరవణన్ ఈ ప్రాజెక్ట్‌ని డైరెక్ట్ చేయబోతున్నాడట.

 

సమంతా కూడా ఇప్పుడు ఈ సినిమాలో నిర్మాతగా కూడా ప్రయత్నాలు చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఆమె నిర్మాతగా ఈ సినిమా వస్తే మాత్రం తొలి సినిమా అవుతు౦ది. ఇప్పటి వరకు సమంతా కేవలం హీరోయిన్ గానే నటించింది గాని ఎక్కడా నిర్మాత అవతారం ఎత్తలేదు. అదే విధంగా తనతో సినిమాలు చెయ్యాలి అనుకునే దర్శకులకు ఆమె ఇప్పుడు కొన్ని కొత్త షరతులు పెట్టినట్టు సమాచారం. తనతో సినిమా చెయ్యాలి అంటే కచ్చితంగా నటనకు ప్రాధాన్యత ఉండాలని ఆమె స్పష్టంగా చెప్పిందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మరి ఇది ఎంత వరకు నిజమో.

మరింత సమాచారం తెలుసుకోండి: