ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ మారిన అంశాల్లో చిరంజీవి 152వ సినిమా ఆచార్యలో మహేశ్ బాబు నటిస్తున్నాడా లేదా అనదే. సినిమాలో వచ్చు కీలక ఎపిసోడ్ లో ఓ క్యారెక్టర్ ను మొదట రామ్ చరణ్ పోషిస్తాడని వార్తలు వచ్చాయి. అయితే.. ఆర్ఆర్ఆర్ తో తీరికలేని చరణ్ కాకుండా మరో హీరోతో చేయించాలని యూనిట్ భావించింది. ఈ పాత్రకు మహేశ్ కరెక్ట్ గా సరిపోతాడని భావించాడు కొరటాల శివ. చిరంజీవిని ఒప్పించి మహేశ్ కు ఈ క్యారెక్టర్ గురించి చెప్పాడని వార్తలు కూడా వచ్చాయి.

 

 

అయితే.. దాదాపు వారం-పది రోజులుగా ఈ వార్తలపై రకరకాల పుకార్లు వస్తున్నాయో కానీ ఎవరి నుంచీ అఫిషియల్ కన్ఫర్మేషన్ మాత్రం లేదు. మహేశ్ డేట్స్ ఇచ్చాడని, 30కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని గాసిప్స్ అయితే వస్తున్నాయి కానీ ఎవరి నుంచీ క్లారిటీ రావటం లేదు. దీంతో ఈ వార్తలపై మెగాస్టార్ చిరంజీవి సీరియస్ అవుతున్నాడని అంటున్నారు. ఆలోచించి చెప్తా అన్న మహేశ్ నుంచి ఇంకా రిప్లై రాకపోవటంపై పలు అనామానాలు వస్తున్నాయి. ఓపక్క సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. మహేశ్ పై తీయాల్సిన ఎపిసోడ్స్ రెడీ అవుతున్నాయి. మరి మహేశ్ ఎస్ చెప్తాడా.. నో చెప్తాడా అనేది సందిగ్ధంగా మారింది.

 

 

మహేశ్ కాదంటే ఈ పాత్రను చరణ్ తోనో, సాయిధరమ్ తేజ్ తోనో చేయించాలని గతంలోనే ఓ నిర్ణయానికి వచ్చందట యూనిట్. కానీ.. మహేశ్ రెస్పాన్స్ కోసం చూస్తూ టైమ్ వేస్ట్ కావడం కూడా కరెక్ట్ కాదని అనుకుంటున్నారట. చిరంజీవి కూడా ఈ సినిమాను వేగంగా పూర్తి చేసి ఆగష్టు 14న విడుదల చేయాలని భావిస్తున్నాడు. చిరంజీవిమహేశ్ మధ్య మంచి ర్యాపో ఉందనే విషయం తెలిసిందే. మరి మహేశ్ నుంచి ఏం రిప్లై వస్తుందో చూడాలి.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: