అజ్ఞాతవాసి తరువాత రెండేళ్లు గ్యాప్ తీసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ వకీల్ సాబ్ తో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల ఈసినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్ యునానిమస్ రెస్పాన్స్ ను తెచ్చుకొని సినిమాపై అంచనాలను పెంచింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక ఈ చిత్రంలో యువ హీరోయిన్లు అంజలి, నివేత థామస్, అనన్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే పవన్ తరువాత నివేత రోల్ సినిమా కు హైలైట్ కానుందని సమాచారం. ఆపాత్రలో నివేత ఎమోషనల్ నటన తో అదరగొట్టనుందని తెలుస్తుంది. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈచిత్రాన్ని ఎంసీఏ ఫేమ్ వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తుండగా ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ తో కలిసి దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం మే లో విడుదలకానుంది. త్వరలో ఈ సినిమా నుండి మొదటి సాంగ్ విడుదలకానుంది. 
 
 ఇక ఈ సినిమాతోపాటు పవన్  కళ్యాణ్  ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్ లో కూడా నటిస్తున్నాడు.  కొద్దీ రోజుల క్రితం ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ కాగా ప్రస్తుతం రెండో షెడ్యూల్ షూటింగ్ జరుకుంటుంది. మెగా సూర్య బ్యానర్ పై 100 కోట్ల బడ్జెట్ తో  సీనియర్ ప్రొడ్యూసర్  ఏ ఎమ్ రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్ గా నటిస్తుండగా జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కీలక పాత్రలో కనిపించనుంది. ఈఏడాది చివర్లో ఈ చిత్రం ప్రేక్షకులముందుకు వచ్చే అవకాశాలు వున్నాయి. ఈ రెండు సినిమాల తరువాత పవన్, హరీష్ శంకర్ తో తదుపరి చిత్రాన్ని చేయనున్నాడు. మైత్రి మూవీస్ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: