తెలుగు ఇండస్ట్రీలో హీరోగా కెరీర్ ఆరంభించి తర్వాత విలన్ గా మారి మళ్లీ హీరో అవతారం ఎత్తాడు గోపిచంద్. జయం, వర్షం, నిజం చిత్రాల్లో విలన్ గా నటించిన గోపిచంద్ తర్వాత హీరోగా మారి 'శౌర్యం'. 'శంఖం' చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకున్నాడు. కొంత కాలంగా గోపిచంద్ నటిస్తున్నచిత్రాలు వరుస డిజాస్టర్స్ అవుతున్నాయి. గత ఏడాది గోపిచంద్ నటించిన ‘చాణక్య’తో మంచి విజయం అందుకున్నాడు. తాజాగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ‘దర్భార్’ తర్వాత మరో యాక్షన్ భరిత చిత్రంలో నటించబోతున్నారట. మురగదాస్ దర్శకత్వం వహించిన దర్భార్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. కానీ కమర్షియల్ గా లాభాలు మాత్రం తెచ్చిపెట్టలేక పోయింది.
ఈ చిత్రం తమిళ్ తో పాటు తెలుగులోనూ రిలీజ్ అయ్యి మంచి టాక్ ను సొంతం చేసుకుంది. తాజాగా రజిని కాంత్ అజిత్ డైరెక్టర్ శివ తో చిత్రంలో నటిస్తున్నారు. గతంలో శివ వరుసగా అజిత్ తో సినిమాలు చేసి విజయాలను అందుకున్నారు. ఇక ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. మీనా ఖుష్బూ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో విలన్ గా టాలీవుడ్ హీరో నటించనున్నాడని తెలుస్తుంది. డైరెక్టర్ శివ గతం లో తెలుగులో రెండు చిత్రాలు చేశారు. ఈ పరిచయంతోనే రజినీకాంత్ కి విలన్ గా నటించేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది.
ఇక గోపీచంద్ విలన్ గా కెరియర్ ప్రారంభించి హీరోగా ఎదిగిన విషయం తెలిసిందే. కాగా హీరోగా వరుస చిత్రాలు చేస్తున్నప్పటికీ సరైన హిట్ మాత్రం దక్కడం లేదు. దాంతో గోపీచంద్ కూడా విలన్ పాత్రకు ఓకే చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మద్య హీరోలుగా నటించిన వారు విలన్ అవతారాలు ఎత్తుతున్న విషయం తెలిసిందే. ఇటీవల కమెడియన్ గా నటించిన సునీల్ సైతం విలన్ గా నటిస్తున్నారు. కలర్ ఫోటోలో పూర్తిగా విలన్ గా కనిపించబోతున్నాడట సునీల్.