బోయపాటి రవితేజా మూవీ భద్రతో డైరెక్టర్ అయ్యాడు. అది 2005 కాలం. అంటే ఇప్పటికి పదిహేనేళ్ళు అన్నమాట. ఆ తరువాత తులసీ మూవీని వెంకటేష్ తో తీసి హిట్ కొట్టాడు. ఆ తరువాత బాలయ్యతో సింహ మూవీని తీసి బ్లాక్ బస్టర్ కొట్టాడు. అదే వూపుతో జూనియర్ తో దమ్ము తీస్తే దుమ్ము కొట్టింది.

 

ఇక లాభం లేదనుకుని మళ్ళీ బాలయ్యతో లెజెండ్ తీశాడు. ఈసారి కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తరువాత బోయపాటి వేరే వాళ్ళతో సినిమాలు తీసినా వర్కౌట్ కాలేదు. ఇంతలో సరైనోడు మూవీ అల్లు అర్జున్ తో తీసి హిట్ కొట్టాడు. దీంతో ఫాంలోకి వచ్చాడనుకుని  ఏకంగా రాం చరణ్ తో వినయ విధేయ రామ‌ తీస్తే అది భారీ డిజాస్టర్ అయింది.

 

ఇపుడు బోయపాటి మళ్ళీ బాలయ్య దగ్గరకు వచ్చాడు. ఇద్దరికీ కలిపి  రెండు భారీ హిట్లు ఉన్నాయి. అయితే ఈసారి దాన్ని తలదన్నేలా హ్యాట్రిక్  సినిమా ఉండాలని బోయపాటి అనుకుంటున్నాడు. అయితే హీరో, డైరెక్టర్ మాత్రం ఒకే లైన్లో వెళ్తున్నారని ఫ్యాన్స్ అపుడే  కంగారు పడుతున్నారు. మాస్ అంటూ ఊరమాస్ దాకా బోయపాటి వచ్చేశాడు.

 

ఆరేళ్ళ క్రితం కాబట్టి లెజెండ్ మూవీ  హిట్ అయింది. ఇపుడు రోజులు అలా లేవు. పైగా కంటెంట్ తో పాటు టెక్నిక్ ని కూడా మిక్స్ చేసి తీసే మూవీస్ నే జనం  చూస్తున్నారు. బాలయ్య పక్కా మాస్. ఆయన రూలర్ సినిమా  చేస్తే డిజాస్టర్ అయింది. బోయపాటి కూడా రాం చరణ్ తో తీసి చేతులు కాల్చుకున్నాడు.

 

మళ్ళీ ఈ ఇద్దరూ పక్కా మాస్ మూవీనే తీయాలనుకుంటున్నారని టాక్ నడుస్తోంది. పైగా ఈ మూవీలో హీరోయిన్లు ఇద్దరూ కూడా ఫ్రంట్ లైన్లో ఉన్నవారు కాదు. దాంతో ఈ కాంబో మీద మొదట్లో అనుకున్న హైప్ లేకుండా పోయింది. మొదట 70 కోట్లతో మూవీ బడ్జెట్ వేసుకుని ఇపుడు యాభైకి దిగిపోయారు. ఇందులో హీరో, డైరెక్టర్ రెమ్యునరేషన్ తీసేస్తే సినిమాను చుట్టేస్తారని అంటున్నారు. మొత్తానికి బోయపాటి బాలయ్యను ఏం చేస్తాడోనని ఫ్యాన్స్ తెగ  టెన్షన్ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: