మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా అంటే చాలు ఆ ప్రాజెక్ట్ పై రకరకాల గాసిప్పులు వచ్చేస్తాయి. తన ప్రతి సినిమా విషయంలో మీడియా లీకుల పట్ల త్రివిక్రమ్ చాలా డిజప్పాయింట్ మెంట్ తో ఉంటాడు. రీసెంట్ గా రిలీజై సూపర్ హిట్ అందుకున్న అల వైకుంఠపురములో సినిమా కథ కూడా ముందే లీక్ అయ్యింది. ఈ సినిమా ఎన్టీఆర్ ఇంటి గుట్టు సినిమా కథను పోలి ఉంటుందని వార్తలు వచ్చాయి. తీరా సినిమా చూస్తే.. అదే నిజమైంది.

 

ఇక తన తర్వాత సినిమా ఎన్టీఆర్ తో ఫిక్స్ చేసుకున్నాడు త్రివిక్రమ్. ఈ సినిమా కథ కూడా ఇప్పుడు ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి మంత్రిగారి వియంకుడు సినిమాను పోలి ఉంటుందని టాక్. అయితే చిత్ర నిర్మాతలు ఈ రూమర్స్ కు చెక్ పెడుతూ ఈ సినిమా కథ అది కాదని తేల్చేశారు. ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్న ఎన్టీఆర్సినిమా పూర్తి చేశాక త్రివిక్రమ్ సినిమాకు డేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఇయర్ ఎండింగ్ లో మొదలై 2021 సమ్మర్ టార్గెట్ తో ఈ సినిమా వస్తుంది.

 

రాజమౌళి కూడా 2021 జనవరి 8న ట్రిపుల్ ఆర్ సినిమా రిలీజ్ ఫిక్స్ చేశారు. తారక్, త్రివిక్రమ్ సినిమాకు అయినాను పోయి రావలె హస్తినకు అనే టైటిల్ ప్రచారంలో ఉంది. సినిమా సెట్స్ మీదకు వెళ్ళకముందే కేవలం త్రివిక్రమ్ సినిమా కాబట్టే ఈ లీకులు వస్తున్నాయని అంటున్నారు. మరి ఈమధ్యలో తన టీం అందరిని మార్చేసినా ఈ లీకులపై త్రివిక్రమ్ చాలా అప్సెట్ లో ఉన్నాడని తెలుస్తుంది. మరి తారక్ సినిమా విషయంలో ఇక మీదట అయినా జాగ్రత్త వహిస్తే బెటర్. అజ్ఞాతవాసితో తనని నిందించిన నోటితోనే అల వైకుంఠపురములో సినిమాతో పొగిడేలా చేసుకున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: