నటప్రపూర్ణ మంచు మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్, ముందుగా 2004లో వచ్చిన దొంగ దొంగది సినిమా ద్వారా టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమాలో ఆకట్టుకునే నటన, డ్యాన్స్ లు ఫైట్స్ తో అదరగొట్టిన మనోజ్, ఆ తరువాత నుండి మెల్లగా తన టాలెంట్ తో అవకాశాలు అందుకుంటూ ముందుకు సాగారు. అయితే ఇటీవల 2017లో ఒక్కడు మిగిలాడు సినిమా తరువాత దాదాపుగా మూడేళ్ళ గ్యాప్ తీసుకున్న మంచు మనోజ్, ప్రస్తుతం నటిస్తున్న సినిమా అహం బ్రహ్మాస్మి. 

 

శ్రీకాంత్ రెడ్డి రచన, దర్శకత్వంలో మంచు మనోజ్ ఆర్ట్స్ బ్యానర్ యొక్క తొలి వెంచర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా ప్రారంభోత్సవం రేపు వైభవంగా జరుగనుంది. మంచు కుటుంబసభ్యులతో పాటు పలువురు సినిమా ప్రముఖులు కూడా హాజరు కానున్న ఈ వేడుకకు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రత్యేక అతిథిగా విచ్చేసి, సినిమాని క్లాప్ కొట్టి ప్రారంభించనున్నట్లు మంచు మనోజ్ కాసేపటి క్రితం తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అభిమానులకు తెలిపారు. ఫ్రెండ్స్ అన్నా, ఫ్రెండ్ షిప్ అన్నా తనకు ఎంతో ఇష్టం అని, అయితే ఆ విధంగా ఫ్రెండ్ తో పాటు ఆపై మా కుటుంబసభ్యుడిగా మారిపోయిన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్

 

రేపు మా సినిమా ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్నందుకు మా సినిమా యూనిట్ తరపున హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నాం అంటూ మనోజ్ ఒక పోస్ట్ చేస్తూ తెలిపారు. హీరోయిన్ సహా ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక అతి త్వరలో జరుగనున్న ఈ సినిమాలో మనోజ్ పాత్ర ఎంతో వెరైటీ గా ఉండనున్నట్లు సమాచారం. మరి దాదాపుగా మూడేళ్ళ గ్యాప్ తరువాత తదుపరి సినిమా మొదలెడుతున్న మనోజ్, దీని ద్వారా ఎంత మేర సక్సెస్ ని అందుకుంటాడో చూడాలి....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: