రెడ్ సిగ్నల్ పడిందని జర్నీ ఆపేస్తామా.. గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తాం. గ్రీన్ పడగానే మళ్లీ ప్రయాణం మొదలుపెడతాం. వంశీ పైడిపల్లి కూడా ఇలాగే గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఘట్టమనేని లొకేషన్ ను చేరుకోవడానికి జంక్షన్ లోనే వెయిట్ చేస్తున్నాడు. మహేశ్ కోసం కథలు రాస్తున్నాడు. 

 

మహేశ్ బాబుని డైరెక్ట్ చేయాలని, మళ్లీ హిట్ కొట్టాలని వంశీ పైడిపల్లి చాలా ఎక్స్ పెక్ట్ చేశాడు. సరిలేరు నీకెవ్వరు తర్వాత వంశీతో సినిమా ఉంటుందని మహేశ్ చెప్పగానే.. మహర్షి మేజిక్ రిపీట్ అవుతుందని మహేశ్ బాబు ఫ్యాన్స్ అంతా అనుకున్నారు. కానీ ఆ తర్వాత స్టోరీ సెట్ అవ్వలేదని ఈ ప్రాజెక్ట్ పక్కకెళ్లిపోయిందనే టాక్ వచ్చింది. 

 

మహేశ్ బాబు.. వంశీ పైడిపల్లిని పక్కనపెట్టి పరశురామ్ తో డిస్కషన్లు మొదలుపెట్టాడు. ఇంతకుముందు సారీ చెప్పిన ప్రిన్స్, ఇప్పుడు ఒకే చెప్పడంతో వెంటనే కథలోకి వెళ్లిపోయాడు పరశురామ్. ఇక పరశురామ్ రాకతో వంశీ వెంటనే కథలోకి వెళ్లిపోయాడు పరశురామ్.

 

ఇక పరశురామ్ రాకతో వంశీ పైడిపల్లికి బ్రేకులు పడ్డట్టే కనిపించాయి. అయితే మహేశ్ నో చెప్పినా.. వంశీ మాత్రం వెనక్కి తగ్గలేదట. రీసెంట్ గానే ప్రిన్స్ కు మరో స్టోరీ నెరేట్ చేసినట్టు తెలుస్తోంది. 

 

వంశీ పైడిపల్లికి పాత లైన్ ని పక్కనపెట్టి.. మళ్లీ ఓ కొత్త లైన్ వినిపించాడట. అయితే లైన్ విన్న మహేశ్ బాండ్ స్క్రిప్ట్ తో వస్తే చూద్దాం. చిన్న పాయింట్స్ తో పనికాదని చెప్పాడట. దీంతో రైటింగ్ డిపార్ట్ మెంట్ కు బలం ఇచ్చే కొత్త రైట్స్ ని వెతుకుతున్నాడు వంశీ.

 

మరి వంశీ కొత్త రైటర్లతో కలిసి కొత్త కథని ఎప్పుడు రెడీ చేస్తాడు. మహేశ్ నుంచి ఎప్పటికీ గ్రీన్ సిగ్నల్ తెచ్చుకుంటాడు అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: