ఇప్పుడు ప్రభాస్ పాన్ ఇండియా స్టార్. బాహుబలి ఫ్రాంచైజీ తో ఇలా పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ ఆ తర్వాత కూడా సాహో వంటి భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాతో సాహసమే చేశాడు. అయితే ఆ సినిమా బాగా నిరాశ పరచింది. అయిన డార్లింగ్ క్రేజ్ మాత్రం అసలు తగ్గలేదు. అందుకే ఇప్పుడు మహానటి ఫేం నాగ్ అశ్విన్ ప్రభాస్ ని ఎంచుకొని సినిమా చేయబోతున్నాడు. అంతేకాదు ఈ సినిమాని నాగ్ అశ్విన్ ఇంటర్నేషనల్ సినిమాగా తెరకెక్కించడానికి ప్లాన్స్ వేసుకుంటున్నాడట. సైన్స్ ఫిక్షన్ బ్యాక్డ్రాప్తో ఈ సినిమా రూపొందించనున్నాడు నాగ్ అశ్విన్. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందట. హీరో క్యారెక్టరైజేషన్ సినిమాకి హైలెట్ గా నిలుస్తుందని నాగ్ అశ్విన్ చాలా ధీమాగా ఉన్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ఒక్కడే.
అందుకే ప్రభాస్ గురించి రీసెంట్ గా నాగ్ అశ్విన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘‘దేశంలో నేను రాసుకున్న క్యారెక్టర్ను చెయ్యగల హీరో ప్రభాస్ ఒక్కడే. ఇంకెవరూ ఆ క్యారెక్టర్ కి న్యాయం చెయ్యలేరని నిర్మొహమాటంగా వెల్లడించాడు. ఇక ఈ సినిమాని 250 కోట్ల బడ్జెట్తో వైజయంతీ మూవీస్ బ్యానర్పై సి అశ్వినీదత్ నిర్మించనున్నారు. ఇక సినిమాలో నటించడానికి ప్రభాస్కు రూ. 70 కోట్ల రెమ్యూనరేషన్తో పాటు లాభాల్లో వాటా ఇచ్చేందుకు అశ్వినీదత్ అంగీకరించినట్లు ఫిల్మ్ నగర్ లో గత కొన్ని రోజులుగా చర్చించుకుంటున్నారు.
ఇక ప్రస్తుతం ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్లో ప్రభాస్ చేస్తున్న సినిమాకు ‘ఓ డియర్’, ‘రాధే శ్యామ్’ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. ఈ టైటిల్స్ లో ‘ఓ డియర్’ అయితే యూనిక్ గా ఉంటుందని చిత్ర బృదం భావిస్తున్నారట. పూజాహెగ్డే హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమాని ఒక లవ్ స్టోరీ గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా హిట్టయితే ప్రభాస్ మార్కెట్ వాల్యూ పెరుగుతుంది. లేదంటే మళ్ళీ డైలమాలో పడవలసి ఉంటుంది. బాహుబలి తర్వాత వచ్చిన సాహో ప్రభావం ఇప్పటికే కొంత పడింది. అందుకే ముందు అనుకున్న బడ్జెట్ కంటే కొంత తగ్గించారని సమాచారం. మొత్తానికి ‘ఓ డియర్’ ప్రభావం నాగ్ అశ్విన్ తెరకెక్కించబోయో సినిమా మీద చాలా పడబోతుందని అర్థమవుతోంది.