టాలీవుడ్ లో అయినా బాలీవుడ్ లో అయినా స్టార్ హీరోల పక్కన హీరోయిన్ ఎంపిక అనేది దాదాపుగా కష్టం. హీరోయిన్ కి కూడా స్టార్ ఇమేజ్ ఉండాలి అలా అయితేనే ఎంపిక చేస్తూ ఉంటారు దర్శక నిర్మాతలు. చాలా మంది దర్శక నిర్మాతలు హీరోయిన్ ఎంపిక విషయంలో నానా కష్టాలు పడుతూ ఉంటారు. సూపర్ మహేష్ బాబు సినిమాల్లో హీరోయిన్ ఎంపిక అనేది చాలా కష్టమని దర్శకులు చెప్తో ఉంటారు. అయితే అతని పక్కన అందరు హీరోయిన్లు మ్యాచ్ అవ్వరని అంటూ ఉంటారు. 

 

పోకిరి సినిమాలో ఇలియానా మహేష్ పక్కన సరిగా సరిపోయింది. ఆ తర్వాత అతడు సినిమాలో మహేష్ పక్కన త్రిష నటించినా సరే ఆమెకు అంతగా గుర్తింపు రాలేదు అనే చెప్పాలి. అయితే దూకుడు సినిమా తర్వాత మాత్రం సమంతా మహేష్ బాబు గురించి ఎక్కువగా మాట్లాడుకున్నారు టాలీవుడ్ జనం. అలాగే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో మహేష్ బాబు సమంతా కాంబినేషన్ కు మంచి మార్కులు పడ్డాయి. ముఖ్యంగా వారిద్దరి మధ్య సంభాషణ చాలా ఆకట్టుకుంది. దీనితో ఈ జోడిని భవిష్యత్తులో కంటిన్యు చేస్తారని భావించినా 

 

మళ్ళీ ఆగిపోయారు బ్రహ్మోత్సవం సినిమాలో ఈ ఇద్దరు కలిసి నటించారు. ఆ సమయంలో వీరికి మంచి మార్కులే పడ్డాయి. ఈ మధ్య కాలంలో మహేష్ పక్కన ఎంత మంది నటించినా సరే ఆ స్థాయిలో గుర్తింపు రాలేదు. అనుష్క, కైరా అద్వాని, పూజ హెగ్డే చాలా మంది నటించారు. అయినా సరే గుర్తింపు పెద్దగా రాలేదు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో మహేష్ బాబు, సమంతా మధ్య జరిగిన సంభాషణలు ఇప్పటికి సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ముఖ్యంగా లవర్స్ మధ్య ఆ సంభాషణ ఎక్కువగా వస్తు ఉంటుంది. ఆ విధంగా ఇద్దరూ ఆకట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: