అనుకున్నది సాధించాలంటే జీవితంలో ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. దానికోసం ఎంతో కష్టపడి విజయాలు వచ్చినా, అపజయాలు వచ్చినా పట్టువిడవకుండా పరిశ్రమలో పోరాడుతూ చిన్నా పెద్దా అనే తారతమ్యం లేకుండా ఏ పాత్రనైనా పోషిస్తూ... ఆ పాత్రకే వన్నె తెస్తూ తన ప్రతిభతో హీరోగా ఎదిగిన శర్వానంద్ గురించి తెలుసుకుందాం...ఇక సినీ కెరియర్ విషయానికి వస్తే యాక్టింగ్ నేర్చుకున్నాక అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటూ అందరూ ఆడిషన్స్ చేసి బావున్నాం బాగా చేస్తున్నావ్ అన్నారుగాని అవకాశాలు మాత్రం ఇవ్వడం లేదు. దాంతో ఎవరో చెప్పిన మాట ప్రకారం సత్యానంద్ యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అయ్యాడు. అక్కడ నేర్చుకుంటుండగానే అనుకోకుండా అదృష్టం కలిసి వచ్చి 19ఏళ్ళకే హీరోగా అవకాశం వచ్చింది. కానీ ఐదవ తారీఖు సినిమా ఎలా వచ్చిందో అలానే పోయింది. దీంతో పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది. ఆ తర్వాత గౌరి సినిమాలో హీరో ఫ్రెండ్గా అవకాశం రావడంతో ఆ పాత్రలో నటించాడు శర్వా. వెంటనే శ్రవంతికిషోర్ సినిమాలో నలుగురు హీరోల్లో ఒక పాత్ర దక్కింది. అది క్లిక్ అవ్వడంతో మంచి పేరు వచ్చింది కానీ సోలో అవకాశాలైతే మాత్రం రాలేదు. చిన్నచిన్న పాత్రల్లో ఎక్కువ నటించడంతో హీరోగా అతని రీఎంట్రీకి పునాదులు వేసింది. కొన్ని సినిమాలు హిట్ అవ్వకపోయినా తన నటనతో ప్రేక్షకులకు మాత్రం దగ్గరయ్యాడు. గమ్యం, ప్రస్థానం మంచి హిట్ అయ్యాయి. ఆ తర్వాత జర్నీ సినిమా తెలుగు, తమిళ్ రెండు భాషల్లోనూ సూపర్ హిట్ అయింది.
ఆ తర్వాత వచ్చిన రన్రాజారన్ చిత్రంలో ఓ స్టార్ హీరోగా వచ్చాడు. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజుతో మరో సారి తన నటనకి మంచి మార్కులు సంపాదించాడు. ఆ తర్వాత ఎక్స్ప్రెస్రాజా చేసి మాస్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. 2017లో శతమానం భవతి చిత్రంతో మరోసారి భారి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అదే సమయంలో వచ్చిన రాధ సినిమా నిరాశ పరిచినా తన నటనతో ఆకట్టుకున్నాడు. మారుతి సినిమాలో మహానుభావుడు చిత్రంలో వైవిధ్యమైన పాత్రలో నటించాడు కానీ ఆశించినంత ఫలితం రాలేదు. ఇక ఇక సాయిపల్లవితో కలిసి పడిపడిలేచె మనసు చిత్రం చేసినా హిట్ కానప్పటికీ రొమాంటిక్ ప్రేమకథ నేపధ్యంలో ఉండడంతో యువతను ఆకట్టుకుంది. సుధీర్ వర్మ దర్శకత్వంలో వచ్చిన రణరంగం చిత్రం కూడా పెద్ద హిట్ టాక్ని సంపాదించలేదు. ఆ తర్వాత వరుస ఫ్లాప్లు రావడంతో కాస్త గ్యాప్ తీసుకుని శర్వా ఇటీవలె జాను సినిమాలో నటించారు. అయితే ఈ సినిమాలో యాక్టింగ్ పరంగా సమంతకి ఎక్కువ మార్కులు వేశారు. ఇక సినిమా కూడా పర్వాలేదనిపించుకుంది. ఇదొక క్లాస్ మూవీ అవ్వడంతో పెద్దగా మాస్ పీపుల్కి పెద్దగా ఎక్కలేదు.
ఇక తాజా సమాచారం ప్రకారం శర్వా, సాయిపల్లవి మరోసారి వెండితెరమీద తళుక్కుమంటారట. కిశోర్ తిరుమల దర్శకత్వంలో ఓ ప్రేమ కథా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఇక ఈ సినిమా షూటింగ్ జూన్ నుంచి మొదలవనుందట. ఇటు కిషోర్ తిరుమల రెడ్ మూవీ బిజీలో ఉండగా... అలాగే సాయిపల్లవి కూడా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ లవ్స్టోరీ బిజీలో ఉన్నారు. అంతేకాక రానాతో కలిసి `విరాటపర్వం` చిత్రంలో కూడా నటిస్తున్నారు. ఇక శర్వా `శ్రీకారం` చిత్రంతో ప్రస్తుతం బిజీగా ఉన్నారు. మరి వీరు ముగ్గురు ఫ్రీ అవ్వగానే ఈ కథను సెట్స్ మీదకు తీసుకువెళ్ళే పనిలో ఉన్నారట. ఈ ఏడాది ఆయన ఓ కీలక నిర్ణయం తీసుకున్నారట. కథ బావుంటేనే సినిమాల్లో నటించాలని. ముఖ్యంగా సన్నిహితంగా ఉండే దర్శక,నిర్మాతల విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకూడదని ఆయన నిర్ణయించుకున్నట్లు సమాచారం.