ఈ ప్రపంచంలో ఎన్నో దేశాల్లో చాలా తక్కువ టైంలో పాపులర్ అయిన రియాల్టీ షో ఏదైనా ఉందంటే అది కేవలం బిగ్ బాస్ షో మాత్రమే. ఎక్కడో యూరప్లోని నెదర్లాండ్స్లో ప్రారంభమైన ఈ షో ఇప్పుడు ప్రపంచంలోని అన్ని దేశాలకు విస్తరించింది. అన్ని దేశాల్లోనూ సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అంతెందుకు భారత్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ షో ఇప్పుడు అన్ని రీజనల్ లాంగ్వేజెస్లోనూ రన్ అవుతోంది. బాలీవుడ్లో పదేళ్లకు పైగా తిరుగులేని విధంగా సక్సెస్ అవుతోంది.
అటు తమిళ్తో పాటు ఇటు తెలుగులో కూడా నడుస్తోంది. తెలుగులో బిగ్ బాస్ వస్తుందంటే చాలు జనాలు టీవీలకు అతక్కుపోతున్నారు. అయితే తొలి సీజన్లో ఎన్టీఆర్ దీనిని హోస్ట్ చేయగా అదిరిపోయే టీఆర్పీలు వచ్చాయి. ఇక రెండో సీజన్లో నాని.. మూడో సీజన్కు నాగార్జున వ్యాఖ్యాతలుగా ఉన్నారు. ఎందుకనో గాని సీజన్ సీజన్కు రేటింగులు అయితే తగ్గాయి. అయితే ఇప్పుడు బిగ్ బాస్కే షాక్ ఇచ్చేస్తున్నాడు బుల్లి తెర పాపులర్ యాంకర్ ఓంకార్. ఓంకార్ బుల్లితెరపై ఎంత పాపులర్ యాంకరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
బిగ్ బాస్ను పక్కన పెట్టేస్తే నిరంతరం ప్రసారం అయ్యే జబర్దస్త్,ఢీ లాంటి షోలను పక్కన పెడితే వీటికొచ్చే రేటింగు అంత షోలు మరే ఇతర ఛానెల్స్ లో లేవని చెప్పాలి. అయితే ఇప్పుడు బిగ్ బాస్నే తలదన్నేలా ఓంకార్ మొదలెట్టిన మరో గ్రాండ్ రియాలిటీ షో “ఇస్మార్ట్ జోడి” బుల్లితెరకు చెందిన పలువురు నటులతో నడిపిస్తోన్న ఈ షోకు ఫిబ్రవరి 23న స్టార్ట్ అయ్యింది. దీనికి ఏకంగా 9.4 టీఆర్పీ రేటింగ్ వచ్చినట్టు తెలుస్తుంది. ఇది ఇటీవల ప్రసారం అవుతోన్న షోల రేటింగులను కంపేరిజన్ చేస్తే చాలా ఎక్కువనే చెప్పాలి. ఏదేమైనా మరోసారి ఓంకార్ తన స్టామినా ఏంటో బుల్లితెర మీద ఫ్రూవ్ చేసుకున్నాడు.