పూణే లో జరుగనున్న తదుపరి షెడ్యూల్ లో గోపి జాయిన్ కానున్నాడని కోలీవుడ్ మీడియా వెల్లడించింది. అదే నిజమైతే దాదాపు 16ఏళ్ళ తరువాత గోపిచంద్ మళ్ళీ విలన్ రోల్ లో కనిపించనున్నాడు. ఇంతకుముందు డైరెక్టర్
శివ ,గోపిచంద్ కాంబినేషన్ లో శౌర్యం ,శంఖం రూపొందాయి. అప్పటినుండి వీరిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం వుంది. దాంతో
శివ, గోపికి తాజాగా ఈ విలన్ పాత్రను ఆఫర్ చేశాడు. మరి గోపిచంద్ నటిస్తున్నాడో లేదో మరి కొద్దీ రోజుల్లో క్లారిటీ రానుంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నాడు.
ఇదిలావుంటే ఇటీవల వరుస పరాజయాలతో సతమవుతున్న గోపిచంద్ ప్రస్తుతం సంపత్ నంది డైరెక్షన్ లో సీటీమార్ లో నటిస్తున్నాడు. కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా కథానాయికగా నటిస్తుండగా భూమిక, దిగంగన సూర్యవంశి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మే లో ఈ సినిమా విడుదలకానుంది. ఈచిత్రం తరువాత గోపిచంద్, విలక్షణ దర్శకుడు తేజ తో ఓ సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో వున్న ఈ చిత్రం మే నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది.