సౌత్ ఇండియా టాప్ స్టార్ హీరోయిన్ లలో ఒకరైన కాజల్ అగర్వాల్‌‌ కు తమిళనాడు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సమన్లు పంపినట్టు వార్తలు తెలుస్తున్నాయి. ఇప్పుడు ఈ విషయం   తెలుగు, తమిళ సినీ వర్గాల్లో ఆలోచించే విషయంగా మారిందని చెప్పవచ్చు. ఇటీవలే భారతీయుడు- 2 సినిమా షూటింగ్ స్పాట్ లో దర్శక, నిర్మాతలు ప్రొడక్షన్ టీమ్ తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో సడన్ గా 150 ఫీట్స్ ఎత్తు నుంచి క్రేన్ కూలిపోవడంతో అక్కడికక్కడే ముగ్గురు వ్యక్తులు చనిపోవడం జరిగింది.

 

IHG


అయితే ఈ ఘటనలో కొంతమంది గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఫిబ్రవరి 19 వ తేదీన ఈవీపీ ఫిల్మ్‌ సిటీలో జరిగిన ఈ దుర్ఘటపై దేశ వ్యాప్తంగా పెద్ద సునామినే సృష్టించింది. ఇది పూర్తిగా చిత్ర యూనిట్ నిర్లక్ష్యం కారణంగానే  ఈ ప్రమాద ఘటన జరిగిందనే దానిపై చెన్నై పోలీసులు ‘భారతీయుడు - 2’ చిత్ర యూనిట్‌పై కేసు నమోదు చేసి 
 పూర్తిగా నిజానిజాలు దర్యాప్తు చేస్తున్నారు.

 

IHG

కాకపోతే ఇప్పటికే తమిళనాడులోని చెన్నై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు లైకా ప్రొడక్షన్స్ వాళ్లతో పాటు దర్శకుడు శంకర్, హీరో కమల్ హాసన్‌ లను చెన్నై ఎగ్మోర్ పోలీస్ కమిషనరేట్ ఆఫీసుకు పిలిపించి విచారణ చేసిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ ఘటనలో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న కాజల్ అగర్వాల్‌ కు చెన్నై పోలీసులు సమన్లు పంపినట్టు  సమాచారం తెలుస్తోంది. అంతే కాకుండా ఈ ఘటనపై ఆమెను ప్రశ్నించడానికి ఇప్పటికే పోలీసులు తమదైన ప్రశ్నలను రచించినట్టు తెలుస్తుంది. ఇకపై చూడాలి ఈ కేసు గురించి ఇంకా ఎంతమంది ప్రశ్నిస్తారో.

మరింత సమాచారం తెలుసుకోండి: