టాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తన హాట్ హాట్ అందాలతో ఎంతగానో గుర్తింపు తెచ్చుకుంది నిధి అగర్వాల్. అక్కినేని హీరో నాగచైతన్య తో జోడీ కట్టి సవ్యసాచి సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెటట్టింది. అయితే నాగచైతన్య నటించిన సవ్యసాచి సినిమా అంతగా ప్రేక్షకాదరణ పొందక పోయినప్పటికీ ఈ అమ్మడు మాత్రం ప్రేక్షకుల్లో  ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆ తర్వాత అక్కినేని అఖిల్ సరసన మిస్టర్ మజ్ను అనే సినిమాలో నటించింది. ఈ  సినిమా కూడా ఈ అమ్మడికి అంతగా కలిసి రాలేదు. ఇక ఆ తర్వాత టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో పూరి నిధి అగర్వాల్ ని సెలెక్ట్ చేశాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. దీంతో ఈ అమ్మడు కెరీర్ మారిపోయింది. ఇక సినిమాల విషయం ఎలా ఉన్నా తన హాట్ హాట్ అందాలతో ఫోటో షూట్లతో మత్తెక్కిస్తూనే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. 

 

 

 

 ఇక తాజాగా టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది ఈ అమ్మడు. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నిథి అగర్వాల్ హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. రమేష్ వర్మ మొన్నటికి మొన్న బెల్లంకొండ శ్రీనివాస్ తో చేసిన రాక్షసుడు సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.చిన్న సినిమాగా క్రైమ్ థ్రిల్లర్ గా  వచ్చిన సినిమాకు  భారీ లాభాలను తెచ్చిపెట్టింది. దీంతో ప్రస్తుతం రవితేజతో తెరకెక్కించిన ఈ సినిమా కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఉండబోతుంది అని ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి. 

 

 

 ఇక ఇప్పటికే వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు రవితేజ . రాజా ది గ్రేట్ తర్వాత విభిన్నమైన కథాంశంతో ముందుకు వచ్చినప్పటికీ సక్సెస్ మాత్రం సాధించలేకపోతున్నారు. హిట్టుకి  ఎంత దూరం అయిపోయాడు మాస్ మహారాజా రవితేజ. ఇక మొన్నటికి మొన్న సైన్స్ ఫిక్షన్ డిస్కో రాజా సినిమా కూడా అంతగా ప్రేక్షకాదరణ పొందలేదు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద రవితేజ కు నిరాశే మిగిల్చింది అని చెప్పాలి. ఈ నేపథ్యంలో... ప్రస్తుతం రమేష్ వర్మ తో తెరకెక్కబోతున్న సినిమాపై రవితేజ భారీగానే ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. మరి రవితేజతో  నిధి అగర్వాల్ మొదటిసారి నటిస్తుండటం...   డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కించే దర్శకుడితో వీరిద్దరి ఫేట్ ఎలా మారుతుంది అనేది చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: