జేజమ్మ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో హేమంత్ మధుకర్ దర్శకత్వంలో కోన ఫిలిం కార్పొరేషన్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలపై టిజి విశ్వప్రసాద్ సమర్పణలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ నిశ్శబ్దం. ఒక థ్రిల్లింగ్, సస్పెన్స్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాక్షి అనే మూగ ఆర్టిస్ట్ గా అనుష్క నటిస్తుండగా మాధవన్, షాలిని పాండే, అంజలి, సుబ్బరాజు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, సాంగ్, టీజర్లకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ రావడంతో పాటు సినిమాపై వారిలో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. 

 

ఇక నేడు ఈ సినిమా అఫీషియల్ థియేట్రికల్ ట్రైలర్ ని నాచురల్ స్టార్ నాని తన చేతుల మీదుగా రిలీజ్ చేసారు. ట్రైలర్ లో ఆద్యంతం సస్పెన్స్ అంశాలు జోడించడం జరిగింది. ఒక మూగ అమ్మాయిని ఎవరో వెంటాడుతూ ఉండడం, దాని గురించి పోలీలుసులు శోధిస్తూ ఉండడం ట్రైలర్ లో మనకు చూపించారు. అలానే మరొక 25 ఏళ్ల అమ్మాయి మరణం, ఒకవేళ ఆ అమ్మాయి ఇదంతా చేస్తుందా అనే కోణం కూడా ట్రైలర్ లో చూపించడం జరిగింది. స్టన్నింగ్ విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, థ్రిల్లింగ్ సీన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ వంటివి ట్రైలర్ లో ఎంతో ఆకట్టుకున్నాయి. 

 

ఇక ట్రైలర్ ని బట్టి చూస్తుంటే ఎప్పటివలె ఈ సినిమాలో కూడా అనుష్క మరొక్కమారు తన సహజ నటనతో అదరగొట్టినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ నిశ్శబ్దం ట్రైలర్ వీక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడంతో పాటు సినిమాపై బాగా అంచనాలు పెంచిందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో దూసుకుపోతోంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాని వేసవి కానుకగా ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: