తెలుగు లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమాలు అంటే ఓ ప్రత్యేకత ఉంటుంది.  ఈ ఏడాది అల్లు అర్జున్ తో ‘అల వైకుంఠపురములో’ సినిమూతో బాక్సాఫీస్ హిట్ అందుకున్నారు.  ఈ మూవీతో సక్సెస్ ఆస్వాదిస్తూనే మరో సినిమాకు రెడీ అవుతున్నారు. ఆయన తదుపరి సినిమా ఎన్టీఆర్ హీరోగా ఆగస్టు నుంచి సెట్స్ పైకి వెళుతుంది. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ మూవీలో నటిస్తున్నారు ఎన్టీర్.  ఈ మూవీ షూటింగ్ పూర్తి కాగానే ఆయన త్రివిక్రమ్ తో ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. 'అయినను పోయిరావలె హస్తినకు' అనే టైటిల్ ను త్రివిక్రమ్ రిజిస్టర్ చేయించిన సంగతి తెలిసిందే.

 

మూవీ పొలిటికల్ డ్రామా తో పాటు ఫుల్ లెన్త్ ఎంట్రటైన్ మెంట్ గా సాగుతుందని సమాచారం. ఒకప్పుడు చిరంజీవి - అల్లు రామలింగయ్య కాంబినేషన్లో వచ్చిన 'మంత్రిగారి వియ్యంకుడు' సినిమా తరహాలో ఈ కథ నడుస్తుందని అంటున్నారు. ఈ మూవీలో అనుకోకుండా డబ్బు సంపాదించిన అల్లు రామలింగయ్యకు మంత్రితో వియ్యం అందుకోవాలని కల... ఆ కల ఎలా నెరవేరుతుంది.. చిరంజీవి ఏం చేశాడు అన్నది సినిమా. కామెడీతో పాటు సోషల్ మెసేజ్ కూడా ఈ మూవీలో ఉంటంది.. మన ఎక్కడ నుంచి వచ్చామన్నది గుర్తు పెట్టుకోవాలి.. నడమంతర సిరి ఎప్పటికీ సంతోషాన్ని ఇవ్వదు అని ఈ సినిమా కథ.  

 

అయితే  రాజకీయ నాయకుడైన తన మావగారిని హీరో ఆటపట్టించడం .. ఆటకట్టించడం తరహాలో ఈ సినిమా సాగుతుందని చెబుతున్నారు. ఆ తరహా కథకి త్రివిక్రమ్ మార్క్ కామెడీ .. ఎంటర్టైన్మెంట్ యాడ్ అవుతాయి.  ఇలాంటి పాత్రల్లో అయితే ఎన్టీఆర్ దుమ్ముదుళుపుతాడు.. ఈ కాన్సెప్ట్ ఆయనకి తప్పకుండా వర్కౌట్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇందులో ఇద్దరు హీరోయిన్లు నటిస్తారట.. ఒకరు పూజా హెగ్డే.. మరోకరు ఎవరు అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: