స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు స్నేహా రెడ్డి పైన మొదటి చూపులోనే ప్రేమ చిగురించింది. ఎవరో ఒక ఫ్రెండ్ మ్యారేజ్ లో కలిసిన వీళ్లిద్దరు ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా ఫోన్ నెంబర్లు మార్చుకొని చాటింగులు చేసుకుని స్నేహం పెంచుకుని ఆపై ప్రేమ లో పడి తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకొని ఇద్దరి పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. 2011లో పెళ్లి చేసుకున్న వీరు ఈరోజు అనగా మార్చి 6వ తేదీన తమ తొమ్మిదవ వివాహ వార్షికోత్సవాన్ని ఎంతో సంబరంగా జరుపుకుంటున్నారు.

 

 

ఈ సందర్భంగా అల్లు అర్జున్ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో తన వెడ్డింగ్ ఫోటోని పోస్ట్ చేసి తన వివాహ బంధం గురించి చెప్పుకొచ్చాడు. 'మా పెళ్లి అయ్యి 9 ఏళ్లు చకచకా గడిచినా... మా మధ్య ప్రేమ మాత్రం రోజురోజుకూ పెరుగుతూ పోతుంది', అని పేర్కొన్నాడు. ఐతే ప్రస్తుతం వీరి ఓల్డ్ వెడ్డింగ్ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. అలానే బెస్ట్ టాలీవుడ్ ఇన్స్పిరేషనల్ కపుల్ అంటూ వీరి ఫోటో ని వేల మంది షేర్ చేస్తుండగా... మరికొంతమంది పదికాలాలపాటు పొట్టి లాగానే ఎప్పటికీ అన్యోన్యంగా ఉండండి హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అల్లు అర్జున్ అండ్ స్నేహ రెడ్డి అంటూ విష్ చేస్తున్నారు.



ఇకపోతే గత కొన్ని వారాలుగా అల్లు అర్జున్ తన గారాలపట్టి అర్హ తో గడిపిన సమయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి అందర్నీ తమ కుటుంబం గురించే మాట్లాడేలా చేశాడు. స్నేహ, అల్లు అర్జున్ కుమారుడు అయాన్ కూడా అప్పుడపుడు సోషల్ మీడియా తెరపై దర్శమిస్తుంటాడు. ఏది ఏమైనా త్రివిక్రమ్ సినిమా అల వైకుంఠపురములో హీరోగా నటించి బ్లాక్ బస్టర్ ని అందుకొని సూపర్ ఖుషి గా ఉన్నాడు అల్లు అర్జున్. మొన్నామధ్య సామజ వర గమన సాంగ్ కచేరి లో పాల్గొని స్నేహతో కలిసి పాట కూడా పాడాడు అల్లు అర్జున్. ఇలా వారి వివాహానికి సంబంధించిన క్షణాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుని అభిమానులను అలరిస్తున్నాడు అల్లు అర్జున్. 

మరింత సమాచారం తెలుసుకోండి: