ఈ ఏడాది టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ లో అరంభం బాగానే అదిరిపోయింది.  వరుస హిట్స్ మూవీస్ తో మంచి శుభారం పలికారు.  బాలీవుడ్ లో భాగీ సిరీస్‌లో భాగంగా జాకీ ష్రాఫ్‌ త‌న‌యుడు టైగ‌ర్ ష్రాఫ్.. భాగీ, భాగీ 2 మూవీలు చేసిన సంగ‌తి తెలిసిందే.  అహ్మద్ ఖాన్ దర్శకత్వంలో టైగర్ ష్రాఫ్, శ్రద్ధాకపూర్ జంటగా ఈ సినిమాకు సాజిద్ నదియావాలా నిర్మిస్తున్నారు.  ఈ మూవీకి సంబంధించిన టీజర్ కి ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీలో హీరో రితేష్‌ దేశ్‌ముఖ్ .. టైగ‌ర్ ష్రాఫ్ సోద‌రుడిగా క‌నిపించ‌నున్నారు. ఈ మూవీలో  ‘భాగీ 2’లో హీరోయిన్‌గా నటించిన దిశా పటానీ ‘భాగీ 3’లో ఓ స్పెషల్‌ సాంగ్‌ చేశారు.  ఇందులో టైగ‌ర్ ష్రాఫ్ మార్ష‌ల్ ఆర్ట్స్‌, యాక్ష‌న్ సీన్స్ అభిమానుల‌చే ఔరా అనిపిస్తున్నాయి.

 

ఇక  ప్రేక్షకుల స్పందన చూస్తుంటే ఈ మూవీకి మంచి ఆరంభం దక్కినట్టు అనిపిస్తోంది. అప్పుడే రికార్డుల మోత మోగిస్తుంది. బాక్సాఫీస్ రికార్డు రిపోర్టు ప్రకారం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే భాగీ-3  ఐదున్నర కోట్ల రూపాయలు రాబట్టినట్టు సమాచారం.  అయితే ఈ ఏడాది అజయ్ దేవగాన్ నటించిన తాజాజీ బాక్సాఫీస్ షేక్ చేసిన విషయం తెలిసిందే. అడ్వాన్స్ కలెక్షన్లలో ‘తానాజి’ రూ. 5.18 కోట్ల అడ్వాన్స్ రాబట్టింది. అయితే బాగీ 3 అంతకు మించి ఐదున్నర కోట్ల రూపాయలు రాబట్టిందని అంటున్నారు.  

 

ఈ ఏడాది విడుదలైన మూవీస్ లో ‘లవ్ ఆజ్ కల్’ రూ. 3.54 కోట్లు, ‘స్ట్రీట్ డ్యాన్సర్’ రూ. 3.39 కోట్లు, ‘శుభ్ మంగల్ జ్యాదా సావ్ ధాన్’ రూ. 3.16 కోట్ల అడ్వాన్స్ కలెక్షన్లతో టాప్-5లో చోటు దక్కించుకున్నాయి.  అయితే ఇప్పుడు దేశంలో కరోనా ప్రభావం సీనీ పరిశ్రమపై కూడా చూపతుందని తెలిసిందే. ఈ నేపథ్యంలో మల్టీప్లెక్స్ సేల్స్ బాగా పడిపోయాయి. లేదంటే అడ్వాన్స్ రూపంలోనే భాగీ-3 ఎనిమిది కోట్లు రాబట్టేదని బాలీవుడ్ వర్గాలు చెతున్నాయి.  ఇక ఈ మూవీ ట్రైలర్ చూస్తుంటే.. మరికొన్ని రికార్డులు క్రియేట్ చేసేలా ఉందని అంటున్నారు టైగర్ ష్రాఫ్ ఫ్యాన్స్. 

మరింత సమాచారం తెలుసుకోండి: