అక్కినేని ఫ్యామిలీ నుండి సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన అక్కినేని అఖిల్ కి ఇప్పటి వరకు హిట్ పడలేదు. దీంతో అక్కినేని అభిమానులతో పాటు అక్కినేని కుటుంబ సభ్యులు కూడా ఎంతో బాధ పడుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే అక్కినేని ఫ్యామిలీలో అందంతో పాటు అన్ని రకాలుగా ఆల్ రౌండర్ నటనా ప్రతిభ కలిగిన హీరో అక్కినేని అఖిల్. యాక్షన్ సీన్స్ గాని డాన్స్ పరంగా గానీ అక్కినేని ఫ్యామిలీ లో అఖిల్ ని మించినవారు ఎవరూ లేరు. అయినా గాని ఒక్క విజయం అఖిల్ కి వరించలేదు. ఇటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అఖిల్ బాధ్యతని గీతా ఆర్ట్స్ చేతిలో పెట్టారు నాగార్జున. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలో అఖిల్ నటిస్తున్నారు.

 

ఈ సినిమాతో ఎలాగైనా విజయం సాధించాలని సినిమా కోసం కష్టపడుతున్నాడు అఖిల్. అయితే సినిమాకి సంబంధించి ఒక ఫైట్ సన్నివేశంలో ప్రమాదవశాత్తు అఖిల్ గాయపడినట్లు సమాచారం. ఈ క్రమంలో అతడి చేతికి తీవ్ర గాయమైనట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అఖిల్ ను ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే చేతికి తీవ్ర గాయం అవ్వడం తో ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ను కూడా నిలిపివేసినట్లు తెలుస్తుంది.

 

అఖిల్ ఆ గాయం నుంచి తిరిగి కోలుకున్న తరువాతే ఈ చిత్రం షూటింగ్ ను తిరిగి ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది. దీంతో ఈ విషయం తెలుసుకున్న నాగార్జున వెంటనే అఖిల్ కోసం సంచలన నిర్ణయం తీసుకున్నారట. సినిమాలో ఫైట్ అయిన తీసేయండి లేకపోతే డూప్ పెట్టి ఆ సీన్ షూట్ చేయండి దానికి అయ్యే ఖర్చు నేను పెట్టుకుంటా అని నాగార్జున సినిమా యూనిట్ కు తెలియజేశారు అని ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ఏదిఏమైనా అటువంటి ప్రమాదకరమైన సన్నివేశాలలో అఖిల్ చేత చిత్రీకరించ వద్దని చాలా గట్టిగా సినిమా యూనిట్ కి నాగార్జున తెలియజేసినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: