అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన వారిలో సుశాంత్ హీరోగా పలు సినిమాల్లో నటించాడు. అక్కినేని నాగేశ్వర రావు మనవడిగా, నాగార్జున మేనల్లుడిగా తెరంగేట్రం చేసిన సుశాంత్ కాళిదాసు సినిమా ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. కరెంట్, అడ్డా, ఆటాడుకుందాం రా, చిలసౌ.. వంటి సినిమాల్లో హీరోగా నటించాడు. ప్రస్తుతం ‘ఇచట వాహనములు నిలుపరాదు’ అనే సినిమాలో నటిస్తున్నాడు. కొత్త దర్శకుడు దర్శన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ సందర్భంగా సుశాంత్ గాయపడటం చర్చనీయాంశమైంది.
ఈ విషయాన్ని తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసి తన కాలుకు అయిన గాయాన్ని ఫోటో తీసి పోస్ట్ చేశాడు. ‘నో పార్కింగ్ లో పార్క్ చేయకూడదు. పరిస్థితులు బాగున్నా ఇలాంటివి జరుగుతున్నాయి. అయినా పర్లేదు. ఇచట వాహనములు నిలుపరాదు షూటింగ్ లో ఫైట్ సీక్వెన్స్ కు ఇదే ఆఖరు రోజు’ అని రాసుకున్నాడు. సుశాంత్ కు అయిన గాయాన్ని దృష్టిలో పెట్టకుని షూటింగ్ కు వారం రోజులు వాయిదా వేశారట దర్శక నిర్మాతలు. రీసెంట్ గా అక్కినేని వారసుడు అఖిల్ కు కూడా తన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమా షూటింగ్ లో గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో హీరోలకు వరుస గాయాలు కావటం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
రీసెంట్ ఇండస్ట్రీ హిట్ అల.. వైకుంఠపురములో సినిమాలో కీలకపాత్ర చేసి మెప్పించాడు. చిలసౌ తర్వాత పూర్తిస్థాయి హీరోగా నటిస్తున్న సినిమా ఇదే. meenakshi NAIDU' target='_blank' title='మీనాక్షి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మీనాక్షి చౌదరి హీరోయిన్ గా పరిచయమవుతోంది. ఇటివల షూటింగ్స్ లో హీరోలకు గాయాలు కావడం పరిశ్రమ వర్గాలను కలవరపెడుతోంది. ఆమధ్య రామ్ చరణ్, ఎన్టీఆర్, సందీప్ కిషన్ కు షూటింగుల్లో గాయాలైన సంగతి తెలిసిందే. ఇటువంటి ఘటనలు జరుగకుండా హీరోలు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
Shouldn’t have parked in the #NoParking ! Things getting interesting now but all worth it. Last day of action seq today
— sushanth A (@iamSushanthA) March 5, 2020
Ichata Vahanamulu Nilupa Radu#IVNR pic.twitter.com/52YVz8YY34