తమిళనాట విక్రమ్, బాలా ఫ్రెండ్ షిప్ గురించి చాలా గొప్పగా చెప్తారు. వీళ్లిద్దరికి సింక్ అయినట్టు మరొకరు ట్యూన్ కాలేరనే మాటలు వినిపిస్తున్నాయి. అయితే ఇలాంటి స్నేహానికి చరమగీతం పాడాడు విక్రమ్ కొడుకు ధృవ్. దానికి అతని ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్ గా నిలుస్తోంది. 

 

విక్రమ్, బాలా కాంబినేషన్ లో సేతు, పితామగన్ లాంటి కల్ట్ మూవీస్ వచ్చాయి. తమిళ్ తో పాటు, తెలుగు నాట ఈ చిత్రాలు సందడి చేశాయి. ఈ సినిమాల టైమ్ లోనే హీరో విక్రమ్, దర్శకుడు బాలా మంచి స్నేహితులు అయ్యారు. ఈ ఫ్రెండ్ షిప్ తోనే కొడుకు ధృవ్ లాంచింగ్ బాధ్యతలు బాలాకు అప్పగించాడు విక్రమ్. అయితే ఇదే విక్రమ్, బాలా స్నేహాన్ని దెబ్బకొట్టిందని చెబుతున్నారు. 

 

బాలా దర్శకత్వంలో ధృవ్ హీరోగా వర్మ అనే సినిమా లాంచ్ అయింది. అర్జున్ రెడ్డి రీమేక్ గా ఈ చిత్రాన్ని మొదలుపెట్టారు. అయితే భిన్నమైన కథలు తీసే బాలా అర్జున్ రెడ్డిని కూడా తన ట్రాక్ లోకి తీసుకెళ్లాడు. ఇది విక్రమ్ కు నచ్చలేదు. కొడుకుని సూపర్ హీరోగా చూడాలనుకున్న విక్రమ్, ఈ రీమేక్ నుంచి బాలాని తప్పించాడు. అర్జున్ రెడ్డికి అసోసియేట్ గా పనిచేసిన గిరీశాయకి బాధ్యతలు అప్పగించాడు. 

 

వర్మ నుంచి బాలా తప్పుకున్నప్పుడు కోలీవుడ్ మొత్తం విక్రమ్ నే బ్లేమ్ చేసింది. ఈ హీరోల వల్లే బాలాకు అవమానం జరిగిందనే మాటలు వినిపించాయి. అయితే అప్పుడు దీన్ని విక్రమ్ బ్యాచ్ ఖండించింది. కానీ ఇప్పుడు ధృవ్ పోస్ట్తో వర్మ ఆగిపోవడానికి విక్రమ్ కారణమనే మాటలు మళ్లీ మొదలయ్యాయి. 

 

ధృవ్ రీసెంట్ గా ఇన్ స్టాగ్రామ్ లో ఆదిత్య వర్మ వర్కింగ్ స్టిల్స్ పోస్ట్ చేశాడు. సెట్స్ లో విక్రమ్ చేసిన హడావిడి గురించి పెద్ద రాత రాశాడు. ఇక ఈ రాతలు, ఫోటోలు చూడగానే, విక్రమ్ డైరెక్టర్ ను డమ్మీని చేసి, అతనే షూటింగ్ చేసుకున్నాడనే కామెంట్లు వస్తున్నాయి. ఈ ఓవర్ ఇన్వాల్వ్ మెంట్ నచ్చకే బాలా వెళ్లిపోయాడని విక్రమ్ విమర్శిస్తున్నారు. మరి దీనికి తండ్రీ కొడుకుల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: