టాలీవుడ్ లో సూపర్ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన నటి అనుష్క తర్వాత వరుసగా టాప్ హీరోలతో నటిస్తూ నెంబర్ వన్ ప్లేస్ లోకి వెళ్ళిపోయింది. స్వతహాగా యోగా టీచర్ అయిన అనుష్క అప్పట్లో తన ఫిట్నెస్పై ఎంతో శ్రద్ధ చూపించి స్టార్ హీరోలతో నటించిన ఓ వైపు మాత్రం లేడీ ఓరియెంటెడ్ పాత్రలో నటిస్తూ వచ్చింది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో అరుంధతి సినిమాలో నటించిన తర్వాత అనుష్కకు చాలా మంచి పేరు వచ్చింది.

 

రుద్రమ దేవి తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ వచ్చింది ఈ మూవీస్ అనుష్క కు మంచి పేరు తెచ్చిపెట్టాయి. అయితే అనుష్కకు సైజ్ జీరో సినిమా తర్వాత ఫిట్నెస్ విషయంలో చాలా తేడాలు వచ్చాయి.  ఈ అమ్మడు సైజ్ జీరో కోసం శరీరాన్ని బాగాపెంచేసింది . ఆ తర్వాత ఫిట్నెస్ కోసం అనుష్క ఎన్నో కష్టాలు పడింది కానీ తన శరీరాన్ని ఏ మాత్రం కోంట్రోల్లోకి తెచ్చుకోలేక పోయింది. బాహుబలి సినిమాలో అనుష్క రూపాన్ని గ్రాఫిక్స్ చేసి సన్నగా చూపించినట్టు ఆ మధ్య వార్తలు వచ్చాయి. బాహుబలి తర్వాత అనుష్కను నటించిన భాగమతి సినిమా లో కూడా అనుష్క ఆంటీలా కనిపించింది. ఇండస్ట్రీ అన్న తర్వాత ఫిట్ నెస్ గా ఉంటేనే హీరోల సరసన నటించే అవకాశం ఉంటుంది.

 

కోలీవుడ్ నుంచి వరుసగా  హీరోయిన్లు వస్తున్నారు... తమ అందచందాలతో యువతను బాగా ఆదరిస్తున్నారు. అయితే అనుష్క భాగమతి తర్వాత చాలా గ్యాప్ తీసుకొని నిశ్శబ్దం సినిమాలో నటిస్తుంది. ఈ మూవీకి సంబంధించిన టీజర్ ఈరోజు రిలీజ్ అయింది.  తాజాగా ఈ మూవీ టీజర్ చూస్తుంటే మరో హర్రర్ మూవీ లా కనిపిస్తుంది అయితే ఈ మూవీలో మూగ అమ్మాయిలా  అనుష్క కనిపించనున్నట్లు తెలుస్తోంది. మాధవన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు మరో ముఖ్య పాత్రలో అంజలి శాలిని పాండే శ్రీనివాస్ అవసరాల నటిస్తున్నారు. తాజాగా అనుష్క నటించిన ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రిలీజ్ లో అనుష్క నటన అద్భుతంగా ఉందని ప్రేక్షకులు అంటున్నారు. మరి ఈ సినిమాతో అనుష్క ఏ రేంజ్ లో హిట్ కొడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: