అప్పుల ఊబి నుంచి బయటపడొచ్చు గానీ.. బరువు భారం తప్పించుకోవడం చాలా కష్టం. పెరిగిన బరువు కరోనా వైరస్ లా భయపెడుతూనే ఉంటుంది. అనుష్కని ఇప్పటికీ ఈ వెయిట్ ఫ్రాబ్లమ్స్ వెంటాడుతూనే ఉన్నాయి. ఈ కష్టాలు చూస్తూ కూడా.. కంగనా బరువు భారాల్లోకి వెళ్లిపోయింది. మరి ఈ వివాదాల రాణికి బరువు భయాల్లేవా.. ?

 

కంగనా రనౌత్ గొడవలకు ఎంత ముందుంటుందో.. విభిన్నమైన కథలు ఎంచుకోవడానికి అంతే ఉత్సాహం చూపిస్తుంది. ఈ ఉత్సాహంతోనే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్  తలైవిలో టైటిల్ రోల్ ప్లే చేస్తోంది కంగనా. ఇక ఈ మూవీలో జయలలితలా బొద్దుగా కనిపించడానికి కంగన 20 కేజీల వరకు వెయిట్ పెరిగిందని చెబుతున్నారు. 

 

పాత్రకోసం ఎన్ని కష్టాలైనా పడొచ్చని అమిర్ ఖాన్ లాంటి వాళ్లు ప్రూవ్ చేశారు. అయితే సైజ్ జీరో సినిమా కోసం వెయిట్ పెరిగిన అనుష్క, ఇప్పటికీ ఈ బరువుని పూర్తిగా తగ్గించుకోలేకపోయింది. ఈ బరువు భారంతో కెరీర్ ను మోయలేకపోతోంది. మరి ఇప్పుడు కంగనా రనౌత్ 20కేజీలు పెరిగిందనగానే చాలామందికి సైజ్ జీరోనే గుర్తుకొస్తోంది. 

 

కంగనా రనౌత్ తలైవి కోసం కష్టపడి బరువు పెరిగిందని ఆమె కాంపౌండ్ చెబుతుంటే.. సినీజనాలు మాత్రం కొట్టిపారేస్తున్నారు. టీజర్ చూస్తే కంగన చీప్ ట్రిక్స్ తెలుస్తాయని స్టేట్ మెంట్స్ ఇస్తున్నారు. టీజర్ లో కంగన ఫేస్ మాత్రమే లావుగా కనిపించింది. బాడీ మొత్తం సన్నగానే ఉంది. 20కేజీల బరువు పెరిగితే.. ముఖం మాత్రమే లావుగా ఉంటుందా.. శరీరంలో వెయిట్ మారదా అని ట్రోల్ చేస్తున్నారు. అంటే కంగన పబ్లిసిటీ కోసం చీప్ ట్రిక్స్ ప్లే చేస్తోందా..? జయలలిత భౌతికంగా మన మధ్యలో లేకపోయినా.. ఆమె రూపాన్ని ఇప్పటికీ ఆరాధించుకుంటున్నారు తమిళనాడు ప్రజలు. ఆమె జీవిత కథ తలైవి తెరకెక్కుతుండటంతో తమ అమ్మని మళ్లీ చూసుకోవచ్చని భావిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: