టాలీవుడ్ లో హీరోయిన్ల కొరత ఉందన్నది వాస్తవం. మన ఇండస్ట్రీలో హీరో ల సంఖ్య చాలా ఎక్కువ అయితే చాలా మంది హీరోలకు సరైన హీరోయిన్లు లేక ఇబ్బందులు తప్పడం లేదు. సీనియర్ హీరోలు అయిన చిరంజీవి, బాలయ్య, వెంకటేష్ పక్కన నటించే హీరోయిన్లు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. రీ ఎంట్రీ ఇచ్చాక చిరంజీవి ప్రతి సినిమాకు హీరోయిన్ లేక ఇబ్బందులు పడుతున్నారు. నాగార్జున మన్మధుడు టు సినిమా లో రకుల్ ప్రీత్ సింగ్ తో రొమాన్స్ చేసి తీవ్ర విమర్శలకు గురయ్యాడు.

 

 ఇక శ్రేయ, కాజల్, తమన్నా, అనుష్క వీళ్లంతా కెరీర్ చివరి దశలో ఉన్నారు. సమంతకు కూడా పెళ్ళి అయిపోవడంతో ఆమె కూడా కెరీర్ పరంగా ఎక్కువ సినిమాలు చేసే చాన్స్ లేదు. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ ఒక్క పూజ హెగ్డే మాత్రమే ఉంది. టాలీవుడ్ స్టార్ హీరోలు అందరూ ఆమెనే రిపీట్ చేస్తున్నారు. అల్లుఅర్జున్ ఇప్పటికే రెండు సార్లు రిపీట్ చేయగా. ఎన్టీఆర్ కూడా త్రివిక్రమ్ సినిమా కోసం పూజ తోనే జోడి కడతారని టాక్. ఇక రష్మిక మందన అలాంటి క్రేజీ హీరోయిన్ మహేష్ బాబు పక్కన సూట్ కాలేదు అన్న విమర్శలు వచ్చాయి. రష్మిక కేవలం నితిన్ లాంటి మీడియం రేంజ్ హీరోల పక్కన మాత్రమే సెట్ అవుతోంది అని. పెద్ద హీరోల పక్కన ఆమెను ఊహించుకోవడం కష్టంగా ఉందని అంటున్నారు. ఇక క్రేజీ హీరోయిన్ లు అందుబాటులో లేకపోవడంతో కూడా చాలా సినిమాలకు హీరోయిన్ ఎంపిక పెద్ద సమస్యగా మారుతోంది. అంతెందుకు చిరంజీవి పక్కన కొరటాల శివ ఇప్పటికీ సరైన హీరోయిన్ ను సెట్ చేయలేకపోయారు.

 

 బాలయ్య బోయపాటి సినిమా కు అటు తిరిగి ఇటు తిరిగి బొద్దుగుమ్మ అంజలి పేరు ఖరారు చేశారు. ఇక రెండో హీరోయిన్ ఎవరో తెలియని పరిస్థితి వెంకటేష్ కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక బాలీవుడ్ హీరోయిన్లకు అవకాశం ఇస్తే ఇక్కడ రెండు మూడు సినిమాలు చేసి మంచి పేరు రాగానే వాళ్లు తిరిగి ముంబయి చెక్కేస్తున్నా రు. రకుల్ ప్రీత్ సింగ్ లాంటి వాళ్ళు అందుబాటులో ఉన్న వాళ్ళ ను తెలుగు ప్రేక్షకులు మర్చిపోయారు. ఏదేమైనా టాలీవుడ్ హీరోలు హీరోయిన్ల కొరత విలవిలలాడుతున్నారు అన్నది వాస్తవం.

మరింత సమాచారం తెలుసుకోండి: