దివంగత అందాల సుందరి శ్రీదేవి మనల్ని విడిచి అనంతలోకాలకు వెళ్ళిపోయి దాదాపుగా రెండున్నరేళ్లు గడుస్తున్నప్పటికీ కూడా ప్రేక్షకులు, ముఖ్యంగా ఆమె అభిమానులు మాత్రం ఆమెను ఎప్పటికీ మరిచిపోలేరనే చెప్పాలి. ఆమె భౌతికంగా మన మధ్య లేకున్నప్పటికీ, ఆమె నటించిన సినిమాలు, పోషించిన పలు రకాల పాత్రల రూపంలో ఆమె అప్పుడూ మనతోనే ఉంటారని ఇప్పటికీ ఆమె అభిమానులు కొందరు అంటున్నారు. ఇక ఇటీవల ఆమె పెద్ద కూతురు జాన్వీ తొలి సినిమా దఢక్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ దక్కించుకుంది. తొలి సినిమాలో తన అందం, అభినయంతో ప్రేక్షకుల మనసుల్లో మంచి పేరు సంపాదించిన జాన్వీ, ప్రస్తుతం గుంజన్ సక్సేనా, దోస్తానా2, రూహి ఆఫ్జానా సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది. 

 

ఇకపోతే నిన్న ఆమె తన 23వ పుట్టినరోజుని కుటుంబసభ్యులు, పలువురు అభిమానులు, పత్రికా ప్రతినిధుల సమక్షంలో ఎంతో వేడుకగా జరుపుకున్నారు. నిన్న ఉదయం నుండే జాన్వీ హ్యాష్ టాగ్ తో ఆమె ఫ్యాన్స్ పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఆమె పేరుతో ట్రెండ్స్ ని హోరెత్తించగా, పలువురు సినిమా ప్రముఖులు ఆమె ఇంటికి వెళ్లి విష్ చేసినట్లు సమాచారం. ఇక తన బర్త్ డే సందర్భంగా నిన్న సాయంత్రం కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్న జాన్వీ, తన స్నేహితులు, కుటుంబసభ్యులు అందించిన మూడు రకాల కేకులను కట్ చేసారు. కాగా ఆమె కేక్ కటింగ్ కార్యక్రమాన్ని అక్కడి కొందరు ఆమె సన్నిహితులు తమ మొబైల్ కెమెరాల్లో బంధించడం జరిగింది. అయితే జాన్వీ మూడు కేకులు కట్ చేయడం కొంత చర్చనీయాంశం అయింది. 

 

ఎవరైనా బర్త్ డే కి ఒక్క కేక్ మాత్రమే కట్ చేస్తారు, కానీ ఆమె మూడు కేక్ లు ఎందకు కట్ చేసింది, ఎంత వాళ్ళ అమ్మ అతిలోక సుందరి అయితే మాత్రం అలా మూడు కేకులు కట్ చేయాలా అంటూ ఈ విషయమై పలువు చర్చలు మొదలెట్టడం జరిగిందట. అయితే అసలు విషయం ఏమిటంటే, జాన్వి ఇంటికి విచ్చేసిన చాలామంది సన్నిహితులు, ఆమెకు కేక్ లు తెచ్చి ఇచ్చారని, అయితే వారిలో ఎవ్వరినీ ఇబ్బందిపెట్టడం ఇష్టం లేని జాన్వీ, వాటిలో మూడు కేక్ లను ఎంచుకుని కట్ చేసారని సమాచారం. మొత్తానికి తన 23వ పుట్టినరోజుని జాన్వీ ఎంతో ఆనందంగా జరుపుకుందని చెప్పాలి.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: