టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ తనయుడు మహేష్ బాబు ‘రాజకుమారుడు’ సినిమాతో వెండి తెరకు పరిచయం అయినా.. తర్వాత వచ్చిన మురారి, ఒక్కడు, అతడు , పోకిరి, దూకుడు లాంటి సినిమాలతో తనకంటూ మాస్ ఇమేజ్ సంపాదించాడు. మహేష్ బాబు ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే.. పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటున్నారు. భరత్ అనే నేను సినిమా తర్వాత మహర్షితో మంచి హిట్ అందుకున్నాడు. ఈ ఏడాది అనీల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. తాజాగా పరుశరామ్ తో ఓ మూవీలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
మహేష్ బాబుకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈయన సినిమాలు వస్తే బాక్సాఫీస్ బద్ధలైపోతుంది. ముఖ్యంగా సౌత్ ఇండస్ట్రీలో ఈయన కంటే తోపులు ఎవరూ సోషల్ మీడియాలో లేరు. ఇదేదో నోటి మాట కింద చెబుతుంది కాదు.. పక్కా లెక్కలు చూపిస్తున్న సాక్ష్యాలు ఇవి. ఫాలోయర్స్ సంఖ్య ఒకటి రెండు కాదు.. ఏకంగా 9 మిలియన్కు చేరిపోయింది. ఈ రికార్డు మరింత పెరిగిపోతుందని.. ఆయన అభిమానులు అంటున్నారు. తెలుగులో మహేష్ బాబు కంటే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే హీరో మరొకరు లేరు.
సోషల్ మీడియాలో ఈయనకు ఉన్న ఫాలోయింగ్ చూసి బాలీవుడ్ హీరోలు కూడా బాపురే అంటారు. అంతగా తన ఇమేజ్ పెంచుకుంటున్నాడు ఈయన. ఎలాంటి కాంట్రవర్సీకు తావు ఇవ్వకుండా తన కెరీర్ సాఫీగా సాగిస్తున్నాడు.. అందకే ఆభిమానులు అయన్ని ఎంతగానో అభిమానిస్తారు. తాజాగా కొరటాల దర్శకత్వంలో చిరంజీవి ఆచార్యలో కూడా ఓ గెస్ట్ రోల్ చేయబోతున్నాడు సూపర్ స్టార్. అయితే ఇప్పటి వరకు చిరు టీం ఈ న్యూస్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. ఏదేమైనా కూడా సినిమాలతో పాటు సోషల్ మీడియాను కూడా ఏలేస్తున్నాడు రాజకుమారుడు.