అల వైకుంఠపురములో సక్సెస్ తర్వాత త్రివిక్రమ్ తన నెక్స్ట్ సినిమా ఎన్టీఆర్ తో ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కూడా హారిక హాసిని క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ కళ్యాణ్ రామ్ కూడా ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హేగ్దే, రష్మిక ఇద్దరిలో ఒకరు నటిస్తారని వార్తలు రాగా వీళ్ళిద్దరిని కాదని మరో ఇద్దరు ముద్దుగుమ్మలను ఫైనల్ చేశాడట త్రివిక్రమ్.

 

అందులో ఒకరు సమంత అక్కినేని కాగా మరో భామని బాలీవుడ్ నుండి తెస్తున్నట్టు తెలుస్తుంది. ఆర్.ఆర్.ఆర్ కోసం పనిచేస్తున్న అలియా భట్ ను తెలుగులో మరో సినిమా చేయించాలని ప్లాన్ చేస్తున్నారు. తారక్, త్రివిక్రమ్ కాంబో మూవీలో ఈ అమ్మడిని తీసుకోవాలని చర్చలు జరుగుతున్నాయి. అయితే మరోపక్క శ్రీదేవి తనయ జాన్వి కపూర్ ను కూడా ఈ సినిమాలో తీసుకోవాలని చూస్తున్నారాట. ఎన్టీఆర్ సరసన ఈ సినిమాలో ఇద్దరు భామలకు ఛాన్స్ ఉందని తెలుస్తుంది. అందుకే సమంత ఒకరు ఫైనల్ కాగా జాన్వి, అలియా భట్ ఇద్దరిలో ఒకరు ఫైనల్ అవుతారని తెలుస్తుంది.

 

ఇక ఈ సినిమా కథ చిరంజీవి మంత్రిగారి వియంకుడు సినిమాకు పోలిక ఉంటుందని తెలుస్తుంది. ఆల్రెడీ త్రివిక్రమ్ అన్ని సినిమాలకు ఇలాంటి లీక్స్ కామన్ అయ్యాయి. చిత్రయూనిట్ రిలీజ్ ముందు స్పందించకపోయినా సినిమా చూస్తే మాత్రం అవి నిజమే అనిపిస్తాయి. త్రివిక్రమ్, తారక్ సినిమా అయినను పోయి రావలె హస్తినకు టైటిల్ ప్రచారంలో ఉంది. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన మిగతా స్టార్ కాస్ట్ ఎనౌన్స్ మెంట్ చేస్తారట. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు త్రివిక్రమ్. ఆల్రెడీ ఈ ఇద్దరి కంబోలో వచ్చిన అరవింద సమేత సూపర్ హిట్ కాగా ఈ సినిమా అంతకుమించి హిట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: