తెలుగు ఇండస్ట్రీలో ఈ మద్య కొత్త హీరోయిన్ల జోరు బాగా పెరిగిపోయింది. అభినయం అంతంత మాత్రం ఉన్నా ఈ ముద్దుగుమ్మలు తమ అందాలతో కనువిందు చేస్తున్నారు. ఒకప్పుడు నటనకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండేవారు.. కానీ ఈ మద్య కొంత మంది గ్లామర్ తో అలరిస్తున్నారు. అయితే ఇలాంటి నటీమణుల మనుగడ తక్కువ ఉన్నా.. వరుసగా ఛాన్సులు మాత్రం కొట్టేసుకు పోతుంటారని టాక్. తాజాగా బాలీవుడ్ లో ‘మున్నా మైఖెల్’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది నిధి అగర్వాల్. తొలి చిత్రంతోనే అందాలు ఆరబోసి అదరగొట్టింది. అప్పటి నుంచి అందాలతోను అదరగొడుతోంది నిధి. 'సవ్యసాచి'తో తెలుగు ఇండస్ట్రీకి కూడా పరిచయమైన నిధి.
తర్వాత అక్కినేని అఖిల్ తో మిస్టర్ మజ్ను సినిమా చేసిన అది కూడా ప్లాప్ అయింది. పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో రామ్ హీరోగా వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' మూవీలో నటించి సూపర్ హిట్ అందుకుంది. సోషల్ మీడియాల్ ఎప్పుడు యాక్టీవ్ గా ఉండే ఈ హాట్ బ్యూటీ ఫోటో షూట్స్ తో కూడా దుమ్మురేపుతుంది. మత్తేక్కించే కళ్లతో ఎద అందాలను చూపిస్తూ ఈ అమ్మడి ఫోటో షూట్స్ కి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. తాజాగా ఈ ముద్దు గుమ్మకు వరుసగా తెలుగు లో ఆఫర్లు తన్నకుంటూ వస్తున్నాయి. మహేష్ బాబు మేనల్లుడు, గల్ల జయదేవ్ కుమారుడు గల్ల అశోక్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో హీరోయిన్ గా ఫిక్స్ అయింది.
ఈ చిత్రానికి నిధి భారీ రెమ్యునరేషన్ తీసుకుంటుందని సమాచారం. ఇక పవన్, క్రిష్ మూవీకి కూడా నిధినే తీసుకున్నారని సమాచారం. అంతే కాదు ఇప్పుడు మాస్ మహరాజ రవితేజతో మరో బంపర్ ఆఫర్ కొట్టేసిందట. కాగా, మేష్ వర్మ రాక్షసుడు సినిమాతో భారీ హిట్ కొట్టాడు. రవితేజ ప్రస్తుతం హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ అనే సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజ సరసన శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.