సామాజిక బాధ్యతగా గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమాన్ని టీఆర్‌ఎస్‌ ఎంపీ జోగినిపల్లి సంతోష్‌ కుమార్ ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.  కొంత కాలంగా ప్రపంచం పొల్యూషన్ తో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటుంది. భవిష్యత్ లో మానవాలి మనుగడకు ప్రమాదం పొంచి ఉందని.. అన్ని దేశాల్లోమొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్న విషయం తెలిసిందే. పచ్చదనంతో గాలి కాలిష్యాన్ని తగ్గించవొచ్చు. భారత దేశంలో మొక్కలు నాటే కార్యక్రమాలు విరివిగా సాగుతున్నాయి.  తాజాగా ఏపిలో 'గ్రీన్ ఇండియా చాలెంజ్'లో నగరి ఎమ్మెల్యే రోజా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. పలువురు సినీ నటులతో ఆమె  'రోజా వనం' పేరిట మొక్కలు నాటిస్తోన్న విషయం తెలిసిందే.

 

ఈ మద్య ప్రముఖ నటి కుష్బూ శనివారం రోజా వనంలో మొక్కలు నాటారు. మూడు మొక్కలు నాటి మరో ముగ్గురిని నామినేట్ చేశారు. టాలీవుడ్ కొంత మంది నటులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అంతే కాదు జబర్ధస్త్ నటులు రోజా వనం కార్యక్రమంలో పాల్గొంటూ మరికొంత మందికి ఛాలెంజ్ విసురుతున్నారు. జబర్ధస్త్ హైపర్ ఆది... ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తాజాగా జబర్దస్త్‌ యాంకర్‌ రష్మీతో ఆమె మొక్క నాటించారు. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.  'ప్లాంట్స్ అనేవి చాలా ముఖ్యమండీ, ట్రీస్‌ అనేవి చాలా ముఖ్యం.

 

చిన్నపిల్లలకు కూడా నేర్పించాలి' అని ఆమె వ్యాఖ్యానించింది. ఈ చాలెంజ్ స్ఫూర్తిగా అందరూ మొక్కలు నాటాలని రష్మీ పిలుపునిచ్చింది. రోజా తనకు చాలెంజ్‌ విసిరారని, దీంతో మొక్క నాటానని చెప్పింది. అయితే ఈ అమ్మడు మొక్కనాటాలని యాంకర్‌, సినీనటి అనసూయకు చాలెంజ్ విసిరింది. అలాగే, నటుడు సత్యదేవ్, శేఖర్‌ మాస్టర్‌లకు కూడా చాలెంజ్‌ విసురుతున్నట్లు తెలిపింది.  జబర్ధస్త్ కార్యక్రమంలో శేఖర్ మాస్టర్ కూడా పాల్గొంటున్నారు మరి ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి. ఈ మద్య సత్యదేవ్ కూడా మంచి నటుడుగా నిరూపించుకునేందుకు కష్టపడుతున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: