బాలీవుడ్‌ టాప్‌ సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేయటంతో కపిల్‌ శర్మ స్పెషలిస్ట్ వాళ్ల కెరీర్‌ కు సంబంధించిన కీలక సంఘటనలను వాటి వెనుక జరిగిన కొన్ని అనూహ్య పరిణామాలను బయటపెడుతూ ఇంట్రస్టింగ్‌ గా షోను నడిపిస్తున్నాడు కపిల్‌ శర్మ. తాజాగా ఈ షోకు దేవీ షార్ట్ ఫిలిం టీం హాజరయ్యారు. స్టార్ హీరోయిన్‌ కాజోల్‌ తో పాటు నేహా దూపియా, శృతి హాసన్‌, నేనా కులకర్ణి, ముక్తా బర్వే, శివానీ రఘు వంశీ, సంధ్యా మాత్రే, యశస్విని దయామా, రమా జోషిలు పాల్గొన్నారు.

 

ఈ షోలో తన పెళ్లి గురించి షాకింగ్‌ విషయాలను బయట పెట్టింది కాజోల్‌. షో వ్యాఖ్యత కపిల్‌ శర్మ తన కాజోల్‌ తో మీరు ఏదైనా ఫంక్షన్ సందర్భంగా మీడియాను ఆహ్వానించారా అని అడిగాడు. దానికి కాజోల్‌ సమధానం ఇస్తూ... ` హా నేను నా పెళ్లి సందర్భంగా మీడియాకు తప్పు అడ్రస్‌ ఇచ్చాను. ఒక వేళ నేనే ఏ అడ్రస్‌ ఇవ్వకపోతే మీడియా వాళ్లు ఎలాగైన అడ్రస్‌ తెలుసుకుంటారు. అదే నేనే తప్పు అడ్రస్‌ ఇస్తే ఏం ఆలోచించకుండా ఆ అడ్రస్‌ కు పరిగెడతారు. అందుకే తప్పు అడ్రస్‌ ఇచ్చాను` అంటూ చెప్పుకొచ్చింది.

 

పెళ్లి తరువాత సినిమాలకు లాంగ్ గ్యాప్‌ ఇచ్చిన కాజోల్‌ తరువాత  రీ ఎంట్రీ ఇచ్చింది. భర్త అజయ్‌ దేవగన్‌ తో కలిసి పలు చిత్రాల్లో నటించిన కాజోల్, తాజాగా తానాజీ సినిమాలో మరోసారి అజయ్‌ కి జోడిగా నటించింది. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా దాదాపు 260 కోట్ల వసూళ్లు సాధించింది. ఇక దేవీ విషయానికి వస్తే ప్రియాంక బెనర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ షార్ట్‌ ఫిలిం ను నిరంజన్‌ అయ్యంగార్‌, రేయన్‌ ఇవన్‌ స్టీఫెన్‌ లు సంయుక్తంగా నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: