జబర్దస్త్ కామెడీ షోలోని హాస్యనటులు ఎంతో మంది ప్రముఖులను ఎద్దేవా చేస్తూ నవ్వులు పండించడం సర్వసాధారణమైన విషయమే. తెలుగు సీనియర్ ప్రముఖ హీరోల నుండి ఇప్పుడు వచ్చిన హీరోల వరకు ఎవరిని వదలకుండా వారిపై ఎన్నో స్కిట్టులని చేస్తూ కామెడీ పండించడంలో హైపర్ ఆది తర్వాత సుడిగాలి సుధీర్ టీమ్ టాప్ ప్లేస్ లో ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే తాజాగా విడుదలైన జబర్దస్త్ ప్రోమో లో సుడిగాలి సుధీర్ స్కిట్ తో పాటు మరి కొన్ని అంశాల కారణంగా, అది నెట్టింట వైరల్ అవుతుంది. 

 


సుడిగాలి సుధీర్ స్కిట్టు గురించి మాట్లాడుకుంటే... గెటప్ శ్రీను ఈసారి బెత్తం భద్రం పాత్ర తో ఎంట్రీ ఇవ్వగా బెత్తం వారి నిలయం అనే థీమ్ తో కొనసాగుతోంది. ఆటో రాంప్రసాద్, సుడిగాలి సుదీర్ ని గెటప్ శ్రీను బెత్తంతో బాగా వాయించేస్తాడు. దాంతో సుధీర్ తట్టుకోలేక స్టేజి దిగి పారిపోతాడు. ఆటో రాంప్రసాద్ కూడా స్కిట్ ఆపండ్రా బాబు అనడంతో ఫుల్ ఫన్ జనరేట్ అవుతుంది. అయితే వీళ్ళ స్కిట్ అనంతరం ఫసక్ శశి గణపతితో ఎంట్రీ ఇస్తాడు.

 

 

తర్వాత గణపతి మాట్లాడుతూ... నాకు ఒక సెంటిమెంట్ ఉంది. అది వర్కవుట్ కావాలంటే ఎవరితోనో ఒకరితో కొట్టించుకోవాలి' అంటూ అతిథి గా వచ్చిన హిట్ మూవీ హీరో విశ్వక్ సేన్ వద్దకు వెళతాడు. అయితే విశ్వక్సేన్ మాత్రం అతని కొట్టకుండా మీరు మా తాత లాంటి వారు నేను కొట్టను అని చెప్పేస్తాడు. దీంతో రోజా ని కొట్టమని బతిమిలాడ గా ఆమె కొట్టడానికి తిరస్కరిస్తోంది. దాంతో మీరు కొడితే ఈసారి మీకు మినిస్టర్ పదవి కచ్చితంగా వస్తుంది అని చెప్పగా ఆమె బెత్తం తీసుకొని అతని బాగా కొడుతుంది. 

 

 

ఇకపోతే ఈసారి జబర్దస్త్ ప్రోమోలో బెత్తం గురించి చాలా సన్నివేశాలు కనిపించాయి. గతంలో బెత్తం దెబ్బలు బాగా ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. దిశ కేసులోని నిందితులను రెండు బెత్తం దెబ్బలు వేసి వదిలేయమని పవన్ కళ్యాణ్ చెప్పినట్టు వార్తలు వీరవిహారం చేశాయి. అప్పటిలో పవన్ కళ్యాణ్ ని రోజా తో సహా చాలా మంది తీవ్రంగా విమర్శించారు. ఐతే మళ్ళీ ఇప్పుడు బెత్తం టాపిక్ ని జబర్దస్త్ స్టేజి పైకి తెచ్చి అతన్ని పరోక్షంగా ఎద్దేవా చేశారా? అని ప్రశ్న అందరిలో కలుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: