ఉదయభాను... టాలీవుడ్ లో అయినా తెలుగు బుల్లితెర మీద అయినా సరే ఈ పేరు ఎప్పుడూ హాట్ టాపిక్. ఆమె ఎం మాట్లాడినా సంచలనమే. ఎం చేసినా సంచలనమే. ఆమె వ్యాఖ్యలను చాలా మంది ఆసక్తిగా వింటూ ఉంటూ ఉంటారు. ఆమెకు ఒకప్పుడు మీడియా చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉండేది. అయితే ఇప్పుడు ఆమె కనపడటం లేదు. ఆమెకు అవకాశాలు రావడం లేదో ఆమెను ఎవరూ పట్టించుకోవడం లేదో తెలియదు గాని ఆమె మాత్రం ఒక్క అవకాశం వచ్చినా చాలు అనుకుంటూ ఆశగా ఎదురు చూస్తుంది. 

 

తనకు ఉన్న పరిచయాల ద్వారా ఉదయ భాను ఈ మధ్య కాలంలో కొన్ని టీవీ షోస్ లో చేయడానికి ఆసక్తి చూపిస్తుంది. తనకు అవకాశం ఇవ్వాలని ఆమె కోరడంతో కొందరు దర్శకులు నిర్మాతలు ఆమె కోసం లాబ్యింగ్ కూడా చేసినట్టు తెలుస్తుంది. అయినా సరే ఆమెకు అవకాశాలు రావడం లేదని కొందరు అంటున్నారు. సోషల్ మీడియాలో కూడా ఆమె గురించి ఇటీవల వార్తలు కూడా పెద్దగా రావడం లేదు. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ అభిమానులు ఆమె బాలయ్యపై చేసిన కామెంట్స్ తో ఆమెను ఎక్కువగా హైలెట్ చేస్తూ వస్తున్నారు. 

 

గత ఏడాది ప్రేక్షకుల ముందుకి వచ్చిన బాలకృష్ణ సినిమా రూలర్ సినిమా కార్యక్రమంలో ఆమె కనపడింది. ఆ తర్వాత బుల్లి తెర అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నా సరే ఫలితం ఉండటం లేదని అంటున్నారు టాలీవుడ్ జనం. ఇప్పుడు టాలీవుడ్ లో యాంకర్లు ఎక్కువయ్యారు. ఎక్కడ చూసినా సరే కుర్ర యాంకర్ల హవా నడుస్తుంది. వయసు మీద పడుతున్నా సరే సుమా హవా తగ్గడం లేదు. ఇక అనసూయ, రేష్మీ ఎక్కువగా షోస్ చేస్తున్నారు. దీనితో ఉదయభానుని పెద్దగా పట్టించుకునే వారు లేకపోయారని అంటున్నారు. ఇటీవల చాలా మందిని కలిసినా ఫలితం లేదని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: