ముందుగా బాలీవుడ్ లో యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ హీరోగా తెరకెక్కిన మున్నా మైకేల్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన నిధి అగర్వాల్, ఆ సినిమా బాగానే ఆడినప్పటికీ అక్కడ ఆమెకు పెద్దగా అవకాశాలు మాత్రం తెచ్చిపెట్టలేకపోయింది. ఇక ఆ తరువాత తెలుగులో చందు మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన సవ్యసాచి సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నిధి, ఆ సినిమా పెద్దగా సక్సెస్ కానప్పటికీ తన అందంతో కుర్రకారుని మాత్రం ఎంతో ఆకట్టుకుంది. 

 

ఆ తరువాత మరొక అక్కినేని వారసుడు అఖిల్ సరసన మిస్టర్ మజ్నులో నటించి మంచి నటనను కనబరిచిన నిధికి ఆపై డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ లో ఒక హీరోయిన్ గా అవకాశం దక్కడం, ఆ సినిమా రిలీజ్ తరువాత పెద్ద హిట్ కొట్టడం జరిగింది. ఆ సినిమాలో ఒక డాక్టర్ పాత్రలో నటించిన నిధి, సాంగ్స్ లో తన అందంతో అదరగొట్టింది అనే చెప్పాలి. అయితే ఇస్మార్ట్ విజయంతో తనకు మంచి అవకాశాలు వస్తాయని ఎన్నో ఆశలు పెట్టుకున్న నిధికి మాత్రం తీవ్ర నిరాశే ఎదురైనట్లు తెలుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం టాలీవుడ్ లో ఆమె చేతిలో కేవలం మహేష్ మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా తెరకెక్కుతున్న మూవీ ఒక్కటి మాత్రమే ఉంది. 

 

శమంతకమణి దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. దానితో పాటు తమిళ్ లో భూమి, అలానే కన్నడ లో జేమ్స్ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తున్న నిధి, ఇకపై ఇక్కడ ఇంకేమైనా మంచి అవకాశాలు వస్తాయేమో అని ఎదురుచూస్తోందట. పాపం మొత్తానికి ఇస్మార్ట్ శంకర్ వంటి సూపర్ హిట్ తన ఖాతాలో ఉన్నప్పటికీ, అది అమ్మడు ఫేట్ ని ఏ మాత్రం మార్చలేకపోయిందని కొందరు నెటిజన్లు నిధి ప్రస్తుత పరిస్థితిపై పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు.....!! 

 

మరింత సమాచారం తెలుసుకోండి: