ఒకప్పుడు తెలుగు తెరపై విలన్, హీరో పాత్రల్లో నటించిన రాజేష్ నటుడిగా మంచి ఫామ్ లో కొనసాగుతుండగా యాక్సిడెంట్ లో మృతి చెందారు.  ఆయన కూతురు ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం హీరోయిన్ గా కొనసాగుతున్నారు. మొదట బుల్లితెరపై నటించిన ఐశ్వర్య రాజేష్ తర్వాత సెకండ్ హీరోయిన్ గా కొనసాగుతూ వచ్చారు.  తర్వాత హీరోయిన్ గా తమిళంలోనే కాదు హిందీలోనూ తన సత్తా చాటింది.  అచ్చమైన తెలుగు అమ్మాయి  ఐశ్వర్య రాజేష్ తమిళ సినిమాలతోనే తెరంగేట్రం చేసి అక్కడ మంచి విజయాలు అందుకుంది.  

 

సినీ బ్యాగ్ గ్రౌండ్ నుంచి వచ్చిన ఐశ్వర్య రాజేష్ నటన పట్ల తనదైన మార్క్ చాటుకుంటుంది.  కెరియర్ ఆరంభంలోనే విక్రమ్, సూర్య లాంటి స్టార్ హీరోలతో జోడీ కట్టే అవకాశం ఈ భామ తమిళంలో సొంతం చేసుకుంది.  ఇక తెలుగు లో మిస్ మ్యాచ్, కౌసల్య కృష్ణమూర్తి, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాల్లో నటించింది.  అంతే కాదు ఈ అమ్మడు నేచురల్ స్టార్ నానికి జంటగా ‘టక్ జగదీశ్’ అనే సినిమాలో నటిస్తుంది.  సెలబ్రెటీలు సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా.. ఇంటికి వస్తే వంటల కార్యక్రమంలో కూడా బిజీగానే ఉంటారు.  

 

తాజాగా ఐశ్వర్య రాజేష్ ఎగ్ దోశని అద్భుతంగా చేసి అక్క‌డ ఉన్న వారంద‌రికి నోరు ఊరేలా చేసింది. త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ఐశ్వ‌ర్య వీడియో షేర్ చేయ‌డంతో ఇది ఫుల్ వైర‌ల్‌గా మారింది. అయితే ఈ దోష వేసే విధానం చూస్తుంటే.. ఐశ్వర్య రాజేష్ చాలా ఎక్స్‌ప‌ర్ట్‌లా ఉందే అని నెటిజ‌న్స్ అంటున్నారు.   కాగా, వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ మూవీలో సువ‌ర్ణ‌గా నటించిన ఐశ్వ‌ర్య విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ద‌క్కించుకుంది. ప్ర‌స్తుతం పా రంజిత్ నిర్మిస్తున్న సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తుంది. స‌తీష్ ఈ మూవీ తెర‌కెక్కిస్తున్నాడు.  తెలుగు లో కూడా వరుస విజయాలు అందుకుంటే స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by aishwarya Rajessh (@aishwaryarajessh) on

 

మరింత సమాచారం తెలుసుకోండి: