పరశురామ్ గీత గోవిందం సినిమా ఈ ఆగస్టు వస్తే రెండేళ్ళు కంప్లీటవుతుంది. గీత గోవిందం సినిమా పరశురామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమా అని అందరికి తెలిసిందే. విజయ్ దేవరకొండ లాంటి హీరోతో 100 కోట్ల క్లబ్ లో చేరే సినిమా తీసి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాడు. అంతేకాదు ఈ సినిమాకి వచ్చిన అద్భుతమైన కలెక్షన్స్ తో పరశురామ్ అల్లు అరవింద్ దగ్గర నుంచి భారీ మొత్తాన్ని గిఫ్ట్ గా కూడా పొందాడు. అయితే ఆ సినిమా తర్వాత పరశురామ్ ఒక పెద్ద స్టార్ తో సినిమా తీస్తున్నాడని బాగా వార్తలు వచ్చాయి. ఆ సినిమా కూడా అల్లు అరవింద్ నిర్మిస్తారని మాట్లాడుకున్నారు.

 

అయితే మాటల దగ్గరే ఉన్నాయి తప్ప. అంగుళం కూడా పరశురామ్ సినిమా కి సంబంధించిన సినిమా న్యూస్ బయటకి అఫీషియల్ గా రాలేదు. మహేష్ బాబు కి కథ చెప్పాడని మహేష్ బాబు ఒప్పుకున్నాడని ఈ సినిమాని గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ నిర్మిస్తారని తెగ చెప్పుకున్నారు. ఆ తర్వాత పరశురామ్ రెబల్ స్టార్ ప్రభాస్ ని కథ తో మెస్మరైజ్ చేశాడని పరశురామ్ నెక్స్ట్ సినిమా ప్రభాస్ తో అని అన్నారు. కట్ చేస్తే ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న రాధే శ్యాం తర్వాత మానటి ఫేం నాగ్ అశ్విన్ తో కమిటయి తనకోసం లైన్ లో ఉన్న పరశురామ్ తో పాటు మిగతా డైరెక్టర్ కి షాకిచ్చాడు. దాంతో పరశురామ్-ప్రభాస్ కాంబో లేదని క్లారిటీ వచ్చేసింది.

 

ఇక ప్రస్తుతం పరశురామ్ అక్కినేని నాగ చైతన్య తో 'నాగేశ్వర రావు' అన్న టైటిల్ తో సినిమాని చేయబోతున్నాడు. 14రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సమ్మర్ లో మొదలవబోతుంది. హీరోయిన్, ఇతర టెక్నీషియన్స్ వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. అయితే పరశురామ్ చైతూ కి గీత గోవిందం లాంటి 100 కోట్ల క్లబ్ లో చేరే సినిమాని ఇస్తాడా అని అక్కినేని ఫ్యాన్స్ అనుకుంటున్నారట. ఇక నాగ చైతన్య శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న 'లవ్ స్టోరీ' సినిమాలో నటిస్తున్నాడు. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: