సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అతి త్వరలో పరశురామ్ పెట్ల దర్శకత్వంలో ఒక సినిమా ప్రారంభం కానున్నట్లు టాలీవుడ్ వర్గాల నుండి కొద్దిరోజులుగా వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. దానితో పాటు మెగాస్టార్, కొరటాల కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో సూపర్ స్టార్ ఒక కీలక పాత్రలో నటించనున్నారని, ఇటీవల ఆ పాత్ర  గురించి మహేష్ కు కొరటాల పూర్తిగా న్యారేషన్ ని ఇవ్వడం, అది ఎంతో నచ్చిన మహేష్, వెంటనే సినిమా చేయడానికి ఒప్పుకోవడం జరిగిందని అంటున్నారు. 

 

మొదటి నుండి మెగాస్టార్ ఫ్యామిలీతో సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ లకు మంచి అనుబంధం ఉండడంతో పాటు ,మరోవైపు కొరటాల దర్శకత్వంలో శ్రీమంతుడు, భరత్ అనే నేను వంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలు మహేష్ గతంలో చేసి ఉండడం కూడా ఆయన ఈ సినిమాలో నటించడానికి కారణాలుగా చెప్తున్నారు. అయితే అవి మాత్రమే కాక, మహేష్ పాత్ర సినిమాలో సెకండ్ హాఫ్ లో వస్తుందని, 1990ల కాలం నాటి స్టూడెంట్ యూనియన్ లీడర్ గా సూపర్ స్టార్ తొలిసారి ఒక అద్భుతమైన రోల్ లో నటించనున్నారని సమాచారం. 

 

ఇక మరోవైపు పరశురామ్ కథకు మహేష్ ఓకే చెప్పడంతో, ఆ సినిమాలోని హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక అప్పుడే మొదలెట్టేశారని, సంగీత దర్శకుడిగా గోపి సుందర్ పేరు గట్టిగా వినపడుతోందని, అలానే సూపర్ స్టార్ సరసన తొలిసారిగా మహానటి హీరోయిన్ కీర్తి సురేష్సినిమా ద్వారా ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోనుందని అంటున్నారు. ఈ సినిమాలో మహేష్ పాత్ర ఎంతో వైవిధ్యంగా ఉండడంతో పాటు నేటి యూత్ ని రిప్రెజెంట్ చేసేలా సూపర్ స్టార్ ఈ సినిమాలో కనపడనున్నట్లు టాలీవుడ్ వర్గాల టాక్. మరి ప్రస్తుతం అవుతున్న ఈ వార్త కనుక నిజమైతే, తొలిసారిగా కీర్తి, సూపర్ స్టార్ ప్రక్కన ఛాన్స్ కొట్టినట్లే అని చెప్పాలి....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: