కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీ ఈ వారం విశేషాలు ఒకసారి గమనిస్తే..తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన మాస్టర్ సినిమా ఆడియో రిలీజ్ కానుంది. ముఖ్యంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఐటీ అధికారులు దాదాపు షూటింగ్ స్పాట్ కి వచ్చి స్టార్ హీరో విజయ్ నీ విచారించి...తన ఇంటికి మరియు కార్యాలయాలకు తిప్పి ఇన్కమ్ టాక్స్ దాడులు చేయడం జరిగింది. దీంతో ఆ వార్త అప్పట్లో కోలీవుడ్ ఇండస్ట్రీలో మరియు రాజకీయ రంగాలలో కూడా పెద్ద హాట్ టాపిక్ అయింది. ఇటువంటి నేపథ్యంలో ఆ సమయంలో విజయ్ కూడా ఏమీ పెద్దగా మాట్లాడలేదు. త్వరలో 'మాస్టర్' ఆడియో ఈవెంట్ జరగనున్న నేపథ్యంలో విజయ్ ఏం మాట్లాడతాడో అనేది ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలో సస్పెన్స్ గా మారింది. గతంలో 'బిగిల్' ఈవెంట్ లో అనవసరంగా తన ఫ్యాన్స్ ని కొంతమంది టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారని కామెంట్ చేశాడు.రాజకీయ నాయకులపై ఇన్ డైరెక్ట్ గా సెటైర్స్ వేసిన విజయ్ ఇటీవల తనపై ఐటి దాడులపై కూడా స్పందించే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది.

 

సినిమా ఆడియో వేడుక తమిళ్ మీడియా రంగంలో ప్రముఖ మూడు చానల్స్ లో టెలికాస్ట్ కానున్నట్లు సమాచారం. భారీ స్థాయిలో జరుగుతున్న ఈ ఆడియో వేడుక అలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. ఇదే తరుణంలో మరో వార్త త్రిష గురించి కోలీవుడ్ ఇండస్ట్రీ లో వైరల్ అవుతుంది. అదేమిటంటే సౌత్ ఇండస్ట్రీ లో తనకంటూ సెపరేట్ స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించిన త్రిష...తమిళ సినిమా రంగంలో నిర్మాతలను మోసం చేస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. విషయంలోకి వెళితే సినిమా అగ్రిమెంట్ చేసే ముందు ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరు అవుతా అంటూ చెప్పి డమ్మా కొడుతున్నట్లు వార్తలు వినబడుతున్నాయి.

 

తాజాగా ఆమె నటించిన ‘ప‌ర‌మ‌ప‌ద‌మ్ విల‌యాట్టు’ ప్రమోషన్‌కి వస్తానని డుమ్మా కొట్ట‌డంతో నిర్మాత ల‌బోదిబోమంటున్నాడు. ఇదెక్క‌డి మోసం అంటూ త్రిష‌పై నిప్పులు చెరుగుతున్నాడు.   ప్రమోషన్‌కి రమ్మని త్రిష‌ను ఆహ్వానించిన‌ప్పుడు... తప్పకుండా వస్తానని చెప్పిందనీ, తీరా ఆ స‌మ‌యానికి రాలేద‌ని ఆ నిర్మాత వాపోయాడు. ఈ విధంగా హీరోయిన్ వ్యవహరిస్తే నిర్మాతలు నష్టపోతారని కామెంట్ చేశారు. ఇదే తరుణంలో ఈ నెలలో కాదల్ ముడిచు, డాలర్ దేశం, తాండాచోరు, వరుసనాడు...సినిమాలు రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: