మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన  'మరక్కార్' సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలైంది. అనేక భాషలలో రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ తెలుగులో చిరంజీవి మరియు రామ్ చరణ్ ఇద్దరూ రిలీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ నా ప్రియ స్నేహితుడు మోహన్ లాల్, ప్రియదర్శన్‌ల డ్రీమ్ ప్రాజెక్టు 'మరక్కార్... అరేబియా సముద్ర సింహం' ట్రైలర్ ను విడుదల చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. సినిమాటోగ్రాఫర్ తిరు తన కెమెరా వర్క్‌తో వెండితెరపై మరోసారి అద్భుతాన్ని ఆవిష్కరిస్తారని ఆశిస్తున్నా. చిత్రం విజయం సాధించాలనీ కోరుకుంటున్నా.. అని పేర్కొన్నారు. యాష్ మరియు సూర్య తమిళంలో మరియు కన్నడం యొక్క సినిమా ట్రైలర్ విడుదల చేయడం జరిగింది.

 

భారీ అంచనాలు ఈ సినిమాపై ఉన్నాయి. యాక్షన్ కింగ్ అర్జున్, సుహాసిని, బాలీవుడ్ ఇండస్ట్రీ హీరోలు ఇంకా చాలామంది భారీ తారాగణం ఈ సినిమాలో ఉంది. దీంతో సినిమా రిలీజ్ కోసం ఎంతగానో ఆశగా ఎదురు చూస్తున్నారు మలయాళం సినిమా ప్రేక్షకులు. మాలీవుడ్ సినిమా రంగానికి సంబంధించి మరొక వార్త ఏమిటంటే మలయాళ సినిమా రంగంలో ప్రముఖ నటుడు కళాభవన్ మని నాలుగో వర్ధంతి సందర్భంగా మలయాళం లో ఉన్న సినిమా రంగ ప్రముఖులు సోషల్ మీడియాలో నివాళులు అర్పించారు. ఆయన లేని లోటు మాలీవుడ్ ఇండస్ట్రీలో స్పష్టంగా కనబడుతున్నది అంటూ కొంతమంది భావోద్వేగానికి గురయ్యారు.

 

ఇక మరొక వార్త చూస్తే ప్రముఖ డైరెక్టర్ సాజిన్ బాబుస్ దర్శకత్వంలో వచ్చిన బిర్యాని ఇటీవల బెంగళూరు ఫిలిం ఫెస్టివల్ లో స్పెషల్ జ్యూరీ అవార్డు గెలుచుకుంది. డైరెక్టర్ గా బిర్యాని సినిమా సాజిన్ బాబుస్ కి మూడవది. కర్ణాటక చలనచిత్ర సంస్థ నిర్వహించిన ఈ కార్యక్రమంలో సాజిన్ బాబుస్ అవార్డు గెలుచుకోవడం జరిగింది. ప్రస్తుతానికైతే మలయాళ సినిమా రంగంలో మోహన్ లాల్ నటించిన  'మరక్కార్' సినిమా హడావిడి ఓ రేంజ్ లో ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: