టాలీవుడ్ లో నందమూరి సీనియర్ హీరో బాలకృష్ణ, లెజెండరీ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో మరో సినిమాను చేయనున్నారు. అయితే.. ఇప్పటి వరకు వీరిద్దరి కాంబినేషన్ లో.. సింహా, లెజెండ్ సినిమాలు వచ్చాయి. అయితే.. ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ అవ్వటంతో రెండు హిట్ సినిమాలను తమ ఖాతాలోకి వేసుకున్నాడు బాలయ్య బాబు, దర్శకుడు బోయపాటి శ్రీను.

 

 

అయితే.. మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ లో ఆరేళ్ళ విరామం తర్వాత మరో సినిమా రానుంది. ఈసారి బోయపాటి శ్రీను యాక్షన్ సినిమాను చేయకుండా ఈ సినిమాలో డివోషనల్ టచ్ ఇవ్వబోతున్నాడట. కాగా.,  ఇటీవల కాలంలో వరుస పరాజయాలను ఎదుర్కున్నాడు బాలకృష్ణ. కానీ.. పారితోషికం విషయంలో మాత్రం తగ్గేది లేదంటున్నాడట బాలకృష్ణ. 

 

 

ఈ మధ్య కాలంలో సీనియర్ హీరోల మార్కెట్ ఒడిదుడుకులకి లోనవుతోందనే చెప్పాలి. సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వంటి వారికి భారీగా ఫ్యాన్ ఉన్నా, వారి సినిమాలు బ్రేక్ ఈవెన్ సాధించే దాకా ఉత్కంఠ కొనసాగుతోంది. ఇలా అయ్యేసరికి ఈ ఎఫెక్ట్ వారి పారితోషికాలపై పడుతోంది. కాగా., బోయపాటి నిర్మిస్తున్న సినిమా ప్రస్తుతం సెట్స్‌ పై ఉంది. అయితే  ఈ సినిమాకి బాలకృష్ణ రూ.9 కోట్లు అందుకోబోతున్నారట.

 

 

బాలయ్య బాబు మంచి సక్సెస్ ను అందుకొని చాలా కాలం అవుతోంది.  ఇటీవల చివరగా కనిపించిన సినిమా ''రూలర్'' బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా విఫలమైంది. అలాగే దర్శకుడు బోయపాటి కూడా 'వినయ విధేయ రామ' లాంటి డిజాస్టర్‌ తో ట్రాక్‌ లో తప్పాడు. ఇలా హీరో, డైరెక్టర్ విజయాలకి దూరంగా ఉన్నారు. కాబట్టి ఈ మూవీ అటు బాలయ్యకు, ఇటు బోయపాటికి ఎంతో కీలకం కానుందని తెలుస్తోంది. ముఖ్యంగా బాలయ్య కమర్షియల్ సక్సెస్ అందుకుని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ రబట్టకపోటే మాత్రం రానున్న కాలంలో మార్కెట్ మరింత జారిపోయే ప్రమాదం ఉంది. మరి ఈ సినిమా బంపర్ హిట్ కొట్టి కలెక్షన్స్ రాబట్టుకుని తన మార్కెట్ ను పెంచుకుంటాడా.. లేదా అని వేచి చూడాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి: