ప్రేమమ్  సినిమాలో తమిళ ఇండస్ట్రీలో తన కెరీర్ ని ప్రారంభించిన అనుపమ పరమేశ్వరన్ అక్కడ ఆ సినిమా మంచి విజయం సాధించడంతో ఎంతో క్రేజ్ సంపాదించింది. ఇక తెలుగులో త్రివిక్రమ్ నితిన్ కాంబినేషన్లో తెరకెక్కిన అఆ  సినిమాలో ఓ కీలక పాత్రలో నటించింది అనుపమ పరమేశ్వరన్. ఈ సినిమాలో  గడుసు అమ్మాయి పాత్రలో నటించి... తన నటనతో ఎంతో క్రేజ్ సంపాదించింది. ఇక ఆ సినిమా తర్వాత తెలుగులో వరుస  అవకాశాలను చేజిక్కించుకుంది ఈ అమ్మడు. అయితే టాలీవుడ్లో ఈ అమ్మడు చేసింది చాలా తక్కువ సినిమాలే అయినా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. మరోవైపు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించింది అనుపమ పరమేశ్వరన్. 

 

 

 ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ నిర్మాత దిల్ రాజు నిర్మించిన శతమానం భవతి సినిమా లో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసి తన ఇమేజ్ ను మరింతగా పెంచుతుంది. ఈ సినిమాలో హీరో శర్వానంద్ సరసన నటించి... తన నటనతో అలరించింది. ఈ సినిమాలో ఎంతో క్యూట్ క్యూట్ గా కనిపిస్తూ అభిమానులను మెస్మరైజ్ చేసింది అనుపమ పరమేశ్వరన్. ఈ సినిమా సంచలన విజయం సాధించడంతో ఈ అమ్మడి కెరీర్కి మరింత కలిసొచ్చింది. ఇక ఈ సినిమాకు ఉత్తమ జాతీయ చిత్రంగా కూడా నిలిచిన విషయం తెలిసిందే. 

 

 

 ఇక దిల్ రాజు నిర్మాణంలో నే  మరోసారి ఎనర్జిటిక్ స్టార్ రామ్  తో  హలో గురు ప్రేమకోసమే అనే చిత్రంలో నటించింది అనుపమ పరమేశ్వరన్. కానీ ఈ సినిమా మాత్రం అంతగా ప్రేక్షకులను అలరించలేకపోయింది. ఇక తాజాగా మరోసారి దిల్ రాజు బ్యానర్లోనే ముచ్చటగా మూడోసారి... నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట ఈ క్యూట్ భామ. దిల్ రాజు మేనల్లుడు ఆశిష్ రెడ్డి హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో అనుపమ నటిస్తోందట. మామూలుగా అయితే కొత్త హీరోల సినిమాల్లో నటించేందుకు కాస్త పేరున్న హీరోయిన్ లు ఎక్కువ పారితోషికం డిమాండ్ చేస్తారు కానీ అనుపమ పరమేశ్వర్ కెరీర్ ను బిల్డప్  చేసిన దిల్ రాజు విషయంలో మాత్రం అనుపమ పరమేశ్వరన్ పారితోషికం డిమాండ్ చేయాలేదు  అంటూ వార్తలు కూడా వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: