పదేళ్ల పాటు సినిమా పరిశ్రమకు దూరంగా ఉంటూ తన రాజకీయ బిజీలో గడిపిన మెగాస్టార్ చిరంజీవి తెరపై మళ్లీ ఎప్పుడు కనిపిస్తారని వెయ్యి కళ్లతో ఎదురు చూశారు ఫ్యాన్స్.  అయితే ఫ్యాన్స్ కోరిక మేరకు పదేళ్ల విరామం తర్వాత వివివినాయక్ దర్శకత్వంలో ‘ఖైదీ నెంబర్ 150’ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చారు చిరంజీవి.  ఈ చిత్రం ఆయన స్టామినా ఏంటో చూపించింది.  చిరు స్టైల్, డ్యాన్స్, ఫైట్స్ ఏమాత్రం  తగ్గలేదని తెలిసిందే. ఇదే ఊపులో సైరా నరసింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.  కాకపోతే ఇది కమర్షియల్ హిట్ కాలేదు.

 

ప్రస్తుతం వరుస విజయాలు అందుకుంటున్న కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు.  దేవాదయ శాఖలో జరుగుతున్న అక్రమాలు వెలికి తీసే ఓ ప్రొఫెసర్ పాత్రలో చిరంజీవి కనిపించబోతున్నారట.  అంతకు పూర్వం ఆయన నక్సలైట్ గా కనిపిస్తారట.. అయితే ఇది కేవలం సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు మాత్రమే.  ఇక ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కోరిక ఎప్పుడు తీరుస్తారు మెగాస్టార్ అంటున్నారు.  మెగా ఫ్యామిలీ హీరోలు పవన్ కళ్యాన్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వీరితో మెగాస్టార్ కలిసి ఫుల్ లెన్త్ మూవీ ఎప్పుడు చేస్తారని అడుగుతున్నారు. గతంలో చిరంజీవి నటించిన మూవీలో పవన్ క్లయిమాక్స్ లో కనిపించిన విషయం తెలిసిందే.

 

  ఇక రామ్ చరణ్ తో మగధీర, బ్రూస్ లీ సినిమాల్లో కనిపించారు. కాకపోతే ఇవి రెండూ గెస్ట్ పాత్రలు.. ఇప్పుడు ఈ ఇద్దరు స్టార్లకు క్రేజ్ ఓ రేంజ్ లో ఉంది. ఈ సమయంలో చిరు వారిద్దిరతో కలిసి నటిస్తే కన్నుల పండుగగా ఉంటుందని అంటున్నారు మెగా ప్యాన్స్.  అయితే కొరటాల మూవీలో రామ్ చరణ్ ఉన్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. కానీ ఆర్ఆర్ఆర్ షూటింగ్ బిజీలో ఉండటం వల్ల అది కుదరకపోవొచ్చు అంటున్నారు. ఆ పాత్రపై బన్ని కన్ను పడిందని.. ఆయన చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.  ఏది ఏమైనా మెగా హీరోలు ఒకే స్క్రీన్ పై ఎప్పుడు కనిపిస్తారా అన్న ఆశతో చూస్తున్నారు ఫ్యాన్స్. 

మరింత సమాచారం తెలుసుకోండి: