దక్షిణాది సినిమాల్లో సూపర్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న హీరోయిన్ నయనతార. కెరీర్లో 17ఏళ్లు పూర్తి చేసుకుని ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గా పెద్ద హీరోల సినిమాల్లో మెయిన్ హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకోవడం విశేషం. ఇంతటి రేంజ్ సాధించుకున్న నయన్ సినిమాల ప్రమోషన్లకు రాదు.. అనే అపవాదును మోస్తూనే ఉంది. చేసేది ఎంత పెద్ద హీరో అయినా కూడా ఎటువంటి ప్రమోషన్లకు నయన్ రాలేదు, ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఆ రూల్ ను బ్రేక్ చేసినట్టే కనిపిస్తోంది.

 

 

చిరంజీవి, రజినీకాంత్ సినిమాల ప్రమోషన్లకే రాని నయన్ ఇప్పుడు మనసు మార్చుకుంది. మహిళా దినోత్సవం సందర్భంగా చెన్నైలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గోంది. ఐఆర్ ఎస్ అసోసియేషన్, ఇన్ కమ్ టాక్స్ డిపార్ట్ మెంట్ కలిసి సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ బహిరంగ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైంది. కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన 5k వాక్ లో పాల్గొంది. కాలేజీ యువతులు పాల్గొన్న ఈ వాక్ చెన్నైలోని రాజరత్నం గ్రౌండ్స్ నుంచి నుంగమ్ బాకం వరకూ జరిగింది. సినిమాలతో సహా ఎటువంటి కార్యక్రామాలకి హాజరు కాని నయన్ ఇప్పుడిలా ముఖ్య అతిథిగా ఓ కార్యక్రమానికి రావడం చర్చనీయాంశమైంది.

 

 

బ్లాక్ పోల్కా సూట్ లో నయన్ మెరిసిపోతోంది. ఇంత అందం ఉండబట్టే ఇప్పటికీ పెద్ద హీరోల సినిమాలకు మెయిన్ చాయిస్ లా కనిపిస్తోంది. నయనతార సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. నయనతారను ఈ ఈవెంట్ లో చూస్తే ఇప్పట్లో ఆమె కెరీర్ కు వచ్చిన ఢోకా లేదనే అనిపిస్తోంది. తన మనసు మార్చుకున్న నయన్ ఇకపై తాను నటించే సినిమాల ప్రమోషన్ కార్యక్రమాల్లో, ఇంటర్వ్యూల్లో పాల్గొంటుందేమో చూడాలి. ప్రస్తుతం నయన్ ఫోటోలు, ఈ కార్యక్రమం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Happy women's day

A post shared by nayanthara🔵 (@nayantharaaa) on

 

మరింత సమాచారం తెలుసుకోండి: