తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోగా చలామణి అవుతున్నవారిలో తమళనాట రజినీ తర్వాత అజిత్ కుమార్ కి మంచి పేరు ఉంది.  గత కొంత కాలంగా వరుస విజయాలు అందుకుంటున్న అజిత్ కుమార్ ఇప్పటి వరకు అఫిషియల్  గా సోషల్ మీడియాలో అకౌంట్స్ లేవు.  కోలీవుడ్ నటుడు అజిత్ త్వరలో సోషల్ మీడియాలోకి రాబోతున్నాడంటూ ఇటీవల వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.  అయితే ఈ విషయంపై హీరో అజిత్ స్పందించారు.  ఈ మద్య నేను సోషల్  మీడియాలోకి రాబోతున్నాడంటూ ఇటీవల వైరల్ అవుతున్న  వార్తలో ఎంతమాత్రమూ నిజం లేదని ఆయన తరపు న్యాయవాదులు తెలిపారు.

 

ప్రస్తుత పరిస్థితుల్లో సోషల్ మీడియాలోకి రావాలని భావిస్తున్నట్టు అజిత్ పేర్కొన్నట్టుగా ఆయన సంతకాలతో కూడిన ఓ ప్రకటన ఈ నెల 6న విడుదలైంది.  ఇప్పటి వరకు ఎంతో మంది హీరోలకు సోషల్ మీడియాలో పర్సనల్ అకౌంట్స్ ఉన్న విషయం తెలిసిందే. అవి కూడా ఈ మద్య రీకార్డుల మోత మోగుతున్నాయి.  తాజాగా అజిత్ కూడా సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటన వచ్చింది.   ఆ తర్వాత కాసేపటికే అది వైరల్ అయింది. అది చూసిన అజిత్ అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. అయితే, అది నకిలీ ప్రకటన అని అజిత్ తరపు న్యాయవాదులు తెలిపారు.

 

ఆరో తేదీన వచ్చిన ప్రకటనలో అజిత్ సంతకాలు చూసి ఆశ్చర్యపోయినట్టు చెప్పారు.  తాను ఇప్పటి వరకు అఫిషియల్ గా సోషల్ మీడియా లోకి అడుగు పెట్టలేదని అన్నారు.  ఆ ప్రకటనలో ఉన్న విషయం పూర్తిగా అవాస్తవమని, అజిత్‌కు, ఆ ప్రకటనకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. నిజానికి సామాజిక మాధ్యమాల్లోకి రావడం అజిత్‌కు ఇష్టం లేదని పేర్కొన్నారు. అయితే ఆయన పేరుపై ఫేక్ న్యూస్ పోస్ట్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్దమవుతున్నామన అజిత్ న్యాయవాదులు పేర్కొన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: