మాస్ మహారాజా రవితేజ మార్కెట్ పూర్తిగా పడిపోయింది. టచ్ చేసి చూడు, నేల టిక్కెట్టు, అమర్ అక్బర్ ఆంటోని, డిస్కో రాజా లాంటి వరుస సినిమాలతో ఇప్పుడు రవితేజ సినిమా వస్తుంది అంటే ఎవరూ పట్టించుకోని అంత స్థితికి వెళ్ళిపోయాడు. ఒకప్పుడు రవితేజ సినిమాలు బయ్యర్లు భారీ అడ్వాన్సు ఇచ్చి మరి రైట్స్ సొంతం చేసుకునే వారు. అయితే ఇప్పుడు రిటర్న్ డ‌బుల్ అడ్వాన్సులు హామీ మీద మాత్రమే రవితేజ సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. సినిమా రిలీజ్ అయ్యాక వచ్చిన అమౌంట్ మాత్రమే నిర్మాతలకు ఇస్తారు. 

 

ముందుగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ఎలాంటి అడ్వాన్సులు ఇవ్వరు. రవితేజ రాజా సినిమా క్రాక్ గతంలో రవితేజతో వీర అనే బిగ్ డిజాస్టర్ సినిమా తీసిన రమేష్ వర్మ డైరెక్షన్ లో రవితేజ మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇక సినిమా డైరెక్టర్ మలినేని గోపీచంద్ సైతం సరైన హిట్ లేక విలవిల్లాడుతున్న సంగతి తెలిసిందే రమేష్ వర్మ సినిమాలో రవితేజ సరసన ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారు. వీరిలో ఇప్పటికే నిధి అగర్వాల్ ని ఒక హీరోయిన్ గా ఖరారు చేశారు. మెయిన్ హీరోయిన్ రోల్ కోసం పూజ హెగ్డే ని సంప్రదించారట ప్రస్తుతం పూజ హెగ్డే వరుసగా స్టార్ హీరోల సినిమాలతో బిజీ బిజీగా ఉంది. 

 

ఈ నేపథ్యంలో రవితేజ తో జోడి కట్టేందుకు ఎంత వరకు ఒప్పుకుంటుంది అన్నది చూడాలి. అయితే తన ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ అవ్వడం తో రవితేజ తన సినిమాకు పూజా హెగ్డే, నిధి అగర్వాల్ అలాంటి క్రేజీ హీరోయిన్ లను పెట్టుకుని ఆయన పైకి తీసుకురావాలని చూస్తున్నాడట. రవితేజ ఆశలు ఎంతవరకు ఫలిస్తాయో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: