గత రెండేళ్లుగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు న్యాచారుల్ స్టార్ నానీ. సరైన హిట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. భిన్నమైన కథలను ఎంచుకోవడంలో నానీ నిపుణుడు. అయినా సరే అతనికి ఈ మధ్య కాలంలో చెప్పుకోదగిన సినిమా అంటూ ఏదీ లేదు. దీనితో ఇప్పుడు రాబోయే సినిమాల మీద ప్రత్యేక దృష్టి పెట్టాడు ఈ హీరో. ఇటీవల మంచి హిట్ కోసం చాలా మంది దర్శకులతో మాట్లాడుతున్నాడు. ఇక అగ్ర దర్శకులతో కూడా సినిమాలు చెయ్యాలని చూస్తున్నాడు నాని. 

 

ప్రస్తుతం తనకు హిట్ ఇచ్చిన దర్శకుడితో సినిమా చేస్తున్నాడు. టక్ జగదీష్ అనే డిఫరెంట్ టైటిల్ తో సినిమా చేస్తున్నాడు నానీ. ఈ సినిమా వచ్చే వేసవిలో ప్రేక్షకుల ముందుకి వస్తుంది. నిన్నుకోరి, మ‌జిలీ చిత్రాల‌ను ల‌వ్‌, ఎమోష‌న్స్ ఆధారంగా తీసిన ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను కూడా అదే విధంగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో నానీ ఇద్దరు హీరోయిన్లతో కలిసి నటిస్తున్నాడు. ఒక హీరోయిన్ పెళ్లి చూపులు ఫేం రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. 

 

ఈ సినిమాలో రీతు వర్మ హీరో నానికి ప్రేయసి పాత్రలో నటిస్తుండగా, మరదలి పాత్రలో ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రాజమండ్రి దగ్గరలో ఉన్న తాటిపాక లో జరుగుతుంది. అటు ప్రేయ‌సి, ఇటు  మ‌ర‌ద‌లి మ‌ధ్య మాన‌సికంగా న‌లిగిపోయే పాత్ర‌లో నాని క‌న‌ప‌డితే.. నాని అన్న‌య్య పాత్ర‌లో జ‌గ‌ప‌తిబాబు న‌టిస్తున్నార‌ట‌. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయిపోయింది. ఈ సినిమా తర్వాత నానీ చేసే సినిమా ఏంటీ అనేది స్పష్టత రావడం లేదు. ఈ మధ్య నానీ నిర్మాతగా కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నానీ... నిర్మాతగా కూడా విజయాలు నమోదు చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: