టాలీవుడ్ లో మహేష్ బాబుకి ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సూపర్ స్టార్ గా దాదాపు 15 నుంచి 20 ఏళ్ళు గా టాలీవుడ్ లో తన చక్రం తిప్పుతున్నాడు. చేసినవి తక్కువ సినిమాలే అయినా మహేష్ కి వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న హీరోల్లో మహేష్ బాబు కూడా ఒకరు. ఇక మహేష్ తో సినిమా అనగానే ఎందరో దర్శక నిర్మాతలు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి మహేష్ బాబు క్రేజ్ ఇప్పుడు తగ్గింది అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. 

 

దానికి కారణం ఏంటీ అనేది స్పష్టంగా తెలియకపోయినా మహేష్ తో సినిమాలు చేయడానికి పెద్దగా దర్శక నిర్మాతలు ఆసక్తి చూపించడం లేదని అంటున్నారు. టాలీవుడ్ లో మహేష్ బాబు క్రేజ్ క్రమంగా పడిపోవడానికి కారణం అతనికి ఉన్న కమర్షియల్ ఆలోచనలే అనేది కొందరి మాట. భరత్ అను నేను సినిమా తర్వాత మహేష్ బాబు భారీగా రేటు పెంచాడని కొందరు నిర్మాతలు వాపోతున్నారు. గతంలో సినిమా చెయ్యాలి అతనితో ఒక డ్రీం అనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు వెనక్కు తగ్గారు. సినిమాకు ముందు జరిగే మార్కెట్ మొత్తం మహేష్ బాబు తీసుకుంటున్నాడు. 

 

దీనితో అతనితో భారీగా సినిమాలు ప్లాన్ చేసిన దర్శకులకు నష్టం జరుగుతుంది అనే టాక్ ఎక్కువగా వినపడుతుంది. ఎక్కువగా మహేష్ బాబు రెమ్యునరేషన్ తీసుకోవడానికి ఆసక్తి చూపించడం లేదని టాక్. ఎంత సేపు నిర్మాతగా కూడా మారి... తన సినిమా మార్కెట్ మీద తన పెత్తనమే ఉండాలని భావిస్తున్నాడు. ఇటీవల వచ్చిన ఒక సినిమా విషయంలో ఇలాగే చేస్తే ఇతర నిర్మాతలు నష్టపోయారని సమాచారం. దీనితో మహేష్ తో సినిమా అనగానే దర్శక నిర్మాతలు భయపడే పరిస్థితి ఏర్పడింది అంటున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు వంశీ పైడపల్లి తో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: